సీనియర్ హీరో బాలయ్య.,  మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. హ్యాట్రిక్ కొట్టేందుకు నందమూరి స్టార్ అతి జాగ్రత్త పడుతున్నాడు. ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వొద్దని ఈ సారి బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందేనని బాలయ్య, బోయపాటికి ఆర్డర్ వేశాడట. అందుకే ఈ మాస్ కాంబినేషన్ యూటర్న్ తీసుకున్నట్టు సమాచారం. 


ఎన్టీఆర్ కథానాయకుడు, రూలర్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో బాలయ్యలో కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. తన బాక్సాఫీసు కెపాసిటీ ఎంత అనే విషయంలో ఈ రెండు సినిమాల ఫ్లాప్స్ తో బాలయ్యకు పూర్తి క్లారిటీ వచ్చేసింది. అందుకే బోయపాటి శ్రీను తో తర్వాత చేయబోయే కొత్త సినిమా కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్క్రిప్ట్, బడ్జెట్ లాంటి అన్ని విషయాల్లోనూ బాలయ్య ఆచీతూచి అడుగులు వేస్తున్నాడట. 

 

సహజంగా బాలయ్య.. దర్శకుల హీరో. కానీ ఇప్పుడు దర్శకులను అంత గుడ్డిగా నమ్మొద్దని ఈ సీనియర్ స్టార్ కు బాగా తెలిసొచ్చింది. అందుకే ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేయాల్సిన బోయపాటి శ్రీనుని బాలయ్య మరో స్టోరీ చెక్ చేసుకొని రమ్మని చెప్పాడట. దీంతో బోయపాటి ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుంటున్నాడట. సింహా, లెజెండ్ లాంటి  బ్లాక్ బస్టర్స్ తర్వాత రిపీట్ అవుతున్న కాంబినేషన్ కావడంతో బాలయ్య ఈ సారి కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే అనే పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. 

 

ఫిబ్రవరిలో సినిమాను సెట్స్ కు తీసుకెళ్లాలని బోయపాటి శ్రీను సన్నాహాలు చేస్తున్నాడు. సింహా, లెజెండ్ చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా మాసిజం, యాక్షన్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో బోయపాటి శ్రీను పర్ ఫెక్ట్ స్టోరీ రెడీ చేసుకున్నట్టు టాక్. వినయ విధేయ రామ మూవీతో బోయపాటి శ్రీను ఘోరమైన విమర్శలు మూటకట్టుకున్నాడు. ఈ సినిమాలో జరిగిన తప్పిదాల్ని బేరీజు వేసుకొని అవి రిపీట్ కాకుండా బోయపాటి వర్కవుట్ చేస్తాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: