టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘గంగోత్రి’ మూవీతో హీరోగా పరిచయం అయినప్పటికీ.. దేశముదురు, బన్ని, ఆర్య మూవీస్ తో మెగా హీరో అంటే ఇలా ఉండాలీ అనిపించుకున్నాడు అల్లు అర్జున్. డ్యాన్స్, ఫైట్స్ తో తనదైన స్టైలిష్ లుక్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు బన్ని. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత ‘నాపేరు సూర్య’ తో భారీ అపజయాన్ని పొందారు. ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ గతంలో తనకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మూవీస్ తో మంచి విజయాన్ని అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ మూవీలో నటించారు.
సంక్రాంతి కానుకగా ఈ మూవీ థియేటర్లలో సందడి చేసింది. రిలీజ్ అయిన మొదటి రోజు హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీ రిలీజ్ కి ముందు ఇందులో ‘సామజవరగమన’ సాంగ్ రికార్డుల మోత మోగించింది. ఈ సినిమాకు తమన్ అందించిన పాటలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా ‘సామజవరగమన’ సాంగ్ అయితే ఈ ఏడాదికే బెస్ట్ సాంగ్గా చెప్పుకోవచ్చు. ఇక ‘రాములో రాములా’, ‘బుట్టబొమ్మ’ సాంగ్స్ యూత్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యంలో వచ్చిన ఈ సాంగ్ సిద్ శ్రీరామ్ సింగర్ తన గొంతుతో మాయచేశారు. తమన్ తన సంగీతంతో కోట్లాదిమంది హృదయాలు కొల్లగొట్టారు.
చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి నోటా సామజవరగమనా అనే సాంగ్ పాడుతున్నారంటే ఆ పాట క్రేజ్ అలాంటిది. తాజాగా అల్లు, కొణిదెల కుటుంబాలు సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఒకే చోట చేరగా, స్పెషల్ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు. ఓ గాయకుడు 'సామజ వర గమనా...' పాటను ఆలపిస్తుంటే, అల్లు అర్జున్ అతనితో గొంతు కలిపారు. పక్కనే ఆయన సతీమణి సిగ్గుపడుతూ ఉండటం.. ఈ జంట స్పెషల్ వీడియోను అల్లు శిరీశ్ రికార్డు చేసి, తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇంకేముంది నిమిషాల వ్యవధిలో ఈ వీడియో వైరల్ అయింది.