టాలీవుడ్ లో 90వ దశకంలో స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నారు నటి రోజా.  హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే రాజకీయాల వైపు వచ్చిన ఆమె ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా  రెండోసారి ఎన్నికయ్యారు.   వైసీపీ లో కీలక నేతగా.. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు.  ప్రత్యర్థి పార్టీ లీడర్ ఎంతటి వారైనా దుమ్ముదుళపడంతో రోజా దే పైచేయి అంటారు.  నటిగా, రాజకీయ నేతగానే కాకుండా బుల్లితెరపై వస్తున్న జబర్థస్త్ కామెడీ షో కి జడ్జీగా వ్యవహరిస్తున్నారు.  జబర్ధస్త్ కామెడీ షో ఇప్పటికీ ఏడేళ్లు దాంటింది. అయితే రోజా, మెగాబ్రదర్ నాగబాబు ఇందులో జడ్జీలుగా వ్యవహరించే వారు.. అయితే ఈ మద్య నాగబాబు జబర్ధస్త్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం రోజా ఒక్కరే జడ్జీగా వ్యవహరిస్తున్నారు.. అప్పుడప్పుడు గెస్ట్ లు ఆ స్థానంలో కూర్చొని అలరిస్తున్నారు.

 

ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోపక్క టీవీ షోలతో ఎంతో బిజీగా గడుపుతోంది రోజా. తాజాగా సంక్రాంతి సంబరాల సందర్భంగా  ప్రముఖ ఛానెల్ 'అమ్మ నాన్న ఓ సంక్రాంతి' అనే స్పెషల్ ప్రోగ్రామ్ ని రూపొందించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా ఒక అమ్మగా తన మాతృత్వాన్ని చాటుకుంది. పిల్లల కోసం మేం కష్టపడుతున్నాం.. కానీ వాళ్లు మీరు మాకు మిస్ అవుతున్నారని అంటుంటే గుండెలు పగిలిపోయినట్లు అనిపిస్తుందని చాలా ఎమోషన్ అయ్యింది. జనవరి 15న ప్రసారమైన ఈ షోలో తమ తల్లితండ్రులను ఉద్దేశించి పిల్లలంతా ‘మనం’ మూవీలో పాట పాడి వినిపించారు.  

 

ఈ పాట తర్వాత రోజా తన కొడుకుతో 'మమ్మీ అంటే భయం లేదా..?' అని అడిగింది.దానికి ఆమె కొడుకు.. 'నువ్వంటే ప్రేమ.. భయం లేదు' అంటూ బదులిచ్చాడు.  అంతే ఒక్కసారిగా రోజా ఎమోషన్ అయ్యారు..ఒక్కసారే కన్నీళ్లు పెట్టుకొని కొడుకును దగ్గరకు తీసుకొని  ఏడ్చేసింది. ప్రస్తుతం తాను షూటింగ్స్, రాజకీయ బిజీలో ఉన్నా తన పిల్లలు అర్థం చేసుకుంటున్నారని.. తాను కష్టపడేది మొత్తం వాళ్లకోసమేనని.. కానీ వాళ్లు మాత్రం మాకు కావాల్సింది డబ్బు కాదు మమ్మీ, మీరు మాతో ఉంటడం కావాలని చెబుతుంటారని.. తన కొడుకును హత్తుకొని ఒక్కసారే ఏడ్చేసింది. రోజా కన్నతల్లిగా ఏడ్వటం చూసి పక్కన ఉన్న కంటెస్టంట్లు కూడా ఒక్కసారే కన్నీరు పెట్టుకున్నారు. తాజాగా ఈ వీడియో చూస్తుంటే ఏవరికైనా కన్నీరు రావడం సహజం. 

మరింత సమాచారం తెలుసుకోండి: