స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రం క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన మూవీ అల వైకుంఠపురములో. బన్ని సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో టబు, నివేదా పేతురాజ్ లు కూడా ఉన్నారు. తమిళ భామ నివేదా పేతురాజ్ ఈ సినిమాలో నటిస్తుందని ఎనౌన్స్ మెంట్ రాగా అమ్మడికి ఇది లక్కీ ఛాన్స్ అనుకున్నారు. కాని సినిమా చూశాక తెలిసింది తనది కేవలం రెండు మూడు సీన్స్ మాత్రమే ఉన్న డైలాగ్ అని.. బన్నితో కేవలం రెండు సీన్స్.. సుశాంత్ లో మరో రెండు సీన్స్ ఇవే నివేదా పేతురాజ్ కు ఉన్న సన్నివేశాలు.

 

ఓ పక్క పూజా హెగ్దెని గ్లామర్ గా చూపించిన త్రివిక్రం నివేదా పేతురాజ్ కు మాత్రం అన్యాయం చేశాడని అంటున్నారు. తమిళంలో ఆల్రెడీ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయిన నివేదా పేతురాజ్ మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత బ్రోచేవారెవరురా.. చిత్రలహరి సినిమాల్లో కూడా సెకండ్ లీడ్ గా చేసింది. అందం అభినయం ఉన్న ఈ భామకు తెలుగులో మంచి అవకాశాలు రావడం లేదని చెప్పాలి. అల వైకుంఠపురములో సినిమా నివేదా పేతురాజ్ ఉంది అంటే ఉందని అనుకోవడమే తప్ప ఆమెకు ఏమాత్రం ఇంపార్టెన్స్ లేదని చెప్పాలి.

 

ఇక సంక్రాంతి కానుకగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమా విషయానికి వస్తే.. సినిమా సూపర్ హిట్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఓ పక్క సంక్రాంతికి వచ్చిన మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా మంచి టాక్ తో అదే రేంజ్ వసూళ్లతో వెళ్తుంది. రెండు సినిమాలు కమర్షియల్ గా కూడా సక్సెస్ అవడంతో ప్రస్తుతం టాలీవుడ్ కళకళలాడుతుంది. సంక్రాంతికి వచ్చిన ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు సక్సెస్ అవడం వల్ల ఫ్యాన్స్ కూడా సంతోషంగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: