ఈ సంక్రాంతికి పందెం కోళ్ల హడావుడి ఎంత ఉంటుందో.. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల జోరు కూడా అలాగే ఉంటుంది.  అయితే ఈసారి సంక్రాంతి బరిలో దర్భార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, ఎంత మంచివాడవురా మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఈ మూవీస్ లో రజినీ నటించిన దర్బార్ మూవీ తెలుగు లో పెద్దగా సక్సెస్ సాధించకున్నా.. తమిళనాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఇక అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ మంచి హిట్ అయ్యింది. 

 

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ మూవీ రిలీజ్ అయ్యింది.  ఈ మూవీ మొదటి నుంచి భారీ అంచనాలు వచ్చిన విషయం తెలిసిందే.  ఈ మూవీ రిలీజ్ కి ముందే సామజవరగమన, రాములో రాముల, పుట్ట బొమ్మ అనే సాంగ్స్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించాయి.  అయితే చిత్ర బృందం సినిమా విడదల వరకు కూడా ఓ పాటని సీక్రెట్‌గా ఉంచారు. సినిమా క్లైమాక్స్‌లో ‘సితరాల సిరపడు’ అంటూ సాగే ఈ పాట థియేటర్లలో ప్రేక్షకులచే కేకలు పెట్టించింది. 

 

ఈ పాట వస్తుండగా అల్లు అర్జున్ డ్యాన్స్, ఫైట్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అయితే ఈ పాట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న బన్నీ ఫ్యాన్స్ కి హ్యాపీ న్యూస్ చెప్పారు చిత్ర యూనిట్.   ‘సితరాల సిరపడు’ పాట లిరికల్ వీడియోని శుక్రవారం ఉదయం 10గంటలకు విడుదల చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ పాటని సూరన్న, సాకేత్ కొమండూరి పాడగా.. విజయ్ కుమార్ భళ్లా లిరిక్స్ అందించారు. తమన్ మరోసారి ఈ పాటతో మాయచేయనున్నారని అంటున్నారు చిత్ర యూనిట్. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: