టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సంక్రాంతి సందడి అదిరిపోయే రీతిలో సాగింది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ స్టార్ట్ అవ్వక ముందే సంక్రాంతి వేదికను టార్గెట్ గా చేసుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమాలు నువ్వానేనా అన్నట్టుగా రిలీజ్ తేదీ ల కోసం 2 సినిమా యూనిట్ల మధ్య ఉత్కంఠభరితంగా వాతావరణం నెలకొనడంతో ఈ సంక్రాంతి సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ముఖ్యంగా సినిమా హాల్ల విషయంలో రెండు సినిమాల నిర్మాతలు చివరి వరకు వెనక్కి తగ్గకుండా వ్యవహరించడంతో ఎట్టకేలకు ఒక మాట మీదకు రావడం తో ముందుగా మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా వచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.

 

అయితే ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా ‘అల వైకుంఠపురములో’ అదిరిపోయే హిట్ పడటంతో సంక్రాంతి విజేతగా అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ నిలిచింది. ఇటువంటి తరుణంలో ఈ రెండు సినిమాల కంటే ముందే సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ సంపాదించిన ‘అల వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో దర్బార్ సినిమా హాల్ ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

 

అయితే తమిళంలో కూడా రజనీకాంత్ నటించిన దర్బార్ మరియు ఆయన అల్లుడు ధనుష్ నటించిన ప‌ట్టాస్ సినిమాలు రిలీజ్ అయ్యి భారీ అంచనాల మధ్య విడుదలైన రెండు సినిమాలకు సరైన ఆదరణ కలగక పోవడంతో సంక్రాంతి దెబ్బకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మామ అల్లుళ్ళ సినిమాలు రెండు బోల్తా పడ్డాయి. కొసమెరుపు ఏమిటంటే రజనీకాంత్ నటించిన దర్బార్ కి తెలుగులో వచ్చిన ఆదరణ కూడా తమిళంలో రాలేనట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే మామా, అల్లుళ్ల సినిమాలు రెండూ సంక్రాంతి సీజ‌న్లోనే వ‌చ్చి తమిళ్ బాక్సాఫీస్ దగ్గర అవుట్ అయిపోయాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: