ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ మ‌ధ్య సినిమాల‌కు కాస్త దూరంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి  తెలిసిందే.  ఇటీవ‌లె బాలీవుడ్ చిత్రం `పింక్‌` తెలుగులో రీమేక్ అవుతుంది. ఈ చిత్రంతో ప‌వ‌న్  సినిమాల్లో తిరిగి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. ప‌వ‌న్ ఫ్యాన్స్ త‌న‌ను తెర మీద చూసేందుకు చాలా ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే చాలా గ్యాప్ రావ‌డంతో అంద‌రూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.


ఈ నెల 20వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి ప్లాన్ చేసినట్టు సమాచారం. పవన్ కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. అయితే  ముఖ్యంగా పవన్ కల్యాణ్ తదితరులపై ఫైట్ సీన్ తో మొదటి షెడ్యూల్ ను ఆరంభించనున్నారు. సినిమాలో ఈ ఫైట్ సీన్ తోనే పవన్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ యాక్షన్ సీన్ ను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడని సమాచారం. తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథలోనూ ఆయన మార్పులు చేశాడని అంటున్నారు. హిందీ .. తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కథ, తెలుగు ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి.

 

ఇక‌పోతే ప‌వ‌న్ కు ఉన్న క్రేజ్‌తో సినిమా ఓపెనింగ్స్‌కి ఏమీ ఢోకా లేక‌పోయినా క‌థ క‌థ‌నాలు ఎలా కుదురుతాయో చూడాలి మ‌రి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నివేదాథామ‌స్ లేదా స‌మంత అని కొన్ని పేర్లు మాత్రం విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఎవ‌రిని సెలెక్ట్ చేస్తార‌న్న‌ది తెలియాలి. త‌ర్వాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కోసం ప‌వ‌న్ రెమ్యూన‌రేష‌న్ కూడా భారీగానే పుచ్చుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ స‌మంత ఈ చిత్రాన్ని ఒప్పుకుంటే ఇప్పుడు ప‌వ‌న్‌తో రెండోసారి జ‌త‌క‌ట్టిన‌ట్లు అవుతుంది. అలాగే ప‌వ‌న్, స‌మంత సూప‌ర్ కాంబినేష‌న్ కాబ‌ట్టి తిరిగి చూసుకోఅక్క‌ర్లేద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: