భారతీయ చలన చిత్ర సీమలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రజినీకాంత్ నటించిన సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  రజినీ సినిమా వస్తుందంటే చాలు తమిళ తంబీలు పండుగ చేసుకుంటారు.  ఏ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో... సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘దర్బార్’ మూవీ సంక్రాంతి కానుకగా 9న రిలీజ్ అయ్యింది.  అయితే ఈ మూవీ తెలుగు లో మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే.  గతంలో ఎప్పుడు లేని విధంగా దర్బార్ షూటింగ్ ని స్పీడ్ గా పూర్తి చేసిన తలైవా అదే స్పీడ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అందుకుంటున్నాడు. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా సినిమా 150కోట్లను దాటేసింది. 

 

మూవీ 140కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన దర్బార్ తమిళనాడులో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. అయితే  నైజాం ఏరియాలో సినిమా ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది. 3కోట్లకు అమ్ముడైన ఈ సినిమా షేర్స్ 3.5కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. కానీ మిగతా ఏరియాల్లో ఇంకా దర్బార్ ప్రాఫిట్ జోన్ లోకి రాలేదు.  ఈ సంక్రాంతికి సందర్భంగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు.. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో మూవీస్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

 

  ఈ రెండు మూవీస్ హిట్ టాక్ రావడంతో దర్బార్ మూవీ కలెక్షన్లు అటోమెటిక్ గా తగ్గాయి.   తెలుగు రాష్ట్రాల్లో సినిమా 14కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు టాక్. ఈ వీకెండ్ అనంతరం సినిమా ఎంతవరకు లాభాలని అందిస్తుంది అనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తొలి రెండు రోజుల్లోనే దాదాపుగా 6 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం 7 రోజులు ముగిసేసరికి 9 కోట్లకు చేరువైంది.  కేవలం మురుగదాస్, రజినీ మానియా తోనే ఈ మాత్రం కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: