కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మాస్ సినిమాల దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్ మూవీ దర్బార్. రజిని సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నివేత థామస్ ఒక కీలక పాత్రలో నటించగా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్ గా నటించాడు. ఇక సంక్రాంతి కానుకగా ఒక వారం క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సంపాదించింది. తెలుగులో కూడా బాగానే ముందుకు సాగుతున్న ఈ సినిమా, తమిళనాడు సహా ఓవర్సీస్, సింగపూర్, గల్ఫ్ దేశాల్లో అదరగొడుతూ ముందుకు సాగుతోంది. ఇక చెన్నై నగరంలో అయితే రజిని తన క్రేజ్ తో కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

ఉమెన్ ట్రాఫికింగ్ తో పాటు డ్రగ్స్ వంటి పెను భూతాల నుండి ముంబై నగరాన్ని రక్షించి, విలన్ల భరతం పెట్టె ఆదిత్య అరుణాచలం అనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో రజిని తన అదరగొట్టే పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఇక మురుగదాస్ కూడా తన దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.  ఇక చెన్నై లో ఇప్పటికే రూ.10 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా, అమెరికాలో రూ.10 కోట్లు, అలానే గల్ఫ్ లో రూ.11 కోట్లమేర కొల్లగొట్టి ఓవరాల్ గా వారం మొత్తం

 

రూ.100 కోట్లకు పైగా కలెక్షన్ ని కొల్లగొట్టి ముందుకు సాగుతోంది. గతంలో విజయ్ హీరోగా తెరకెక్కిన తుపాకీ సినిమా తరువాత సరైన సక్సెస్ లేని మురుగదాస్, ప్రస్తుతం రజినితో తీసిన ఈ దర్బార్ మంచి టాక్, కలెక్షన్స్ తో ముందుకు సాగుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలానే రజిని ఫ్యాన్స్ కూడా సినిమా సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తుండడంతో పండగ చేసుకుంటున్నారు. ఇక తెలుగులో కూడా ఈ సినిమా ఇప్పటివరకు బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెంత మేర కొల్లగొడుతుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: