రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తెలుగులోనే కాదు.. సౌత్ లోన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరన్న విషయం ప్రత్యేకంగా ఎవరూ చెప్పనవసరం లేదు. తెలుగులో నే కాదు తమిళంలోను సూర్య, విక్రం వంటి స్టార్స్ కి సింగం సిరీస్, మల్లన్న వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలని మ్యూజిక్ పరంగా ఇచ్చాడు. అయితే ఈమధ్య దేవీ శ్రీ జోరు బాగా తగ్గిపోయింది. 'రంగస్థలం' తప్ప మిగతా సినిమాలలో దేవీ శ్రీ స్థాయి సంగీతం ఉండటంలేదని అటు తమిళంలోను ఇటు తెలుగులోను విమర్శలు జోరుగా వస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇవి విమర్శలు కాదు నిజమని చెప్పొచ్చు కూడా. ఆయన పాటలు రొటీన్ గా అనిపిస్తున్నాయి.. ట్యూన్లు కూడా గతంలో విన్నవాటికి దగ్గరగా ఉంటున్నాయనేది దేవీ ఫ్యాన్సే కాదు ఇటీవల కాలంలో దేవీ మ్యూజిక్ ఇచ్చిన హీరోల ఫ్యాన్స్ కంప్లైంట్ కూడా. 

 

ఇక ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు దేవీ అందించిన మ్యూజిక్ కి అంతగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. వాస్తవంగా దేవి మ్యూజిక్ అంటే ఆ సినిమాకి ముందు నుంచే బజ్ క్రియోట్ అవుతుంది. కానీ సరిలేరు కి అలా జరగలేదు సరి కదా మ్యూజిక్ పెద్ద మైనస్ గా నిలిచింది. ఇక నేపథ్య సంగీతానికి అంత గొప్పగా ప్రశంసలు దక్కలేదు. దీంతో ఇప్పుడు అందరు  దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించే నెక్స్ట్ సినిమా గురించే ఆలోచిస్తున్నారు.

 

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న అల్లు అర్జున్ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. సుకుమార్ సినిమాలకు దేవీ శ్రీ ప్రసాద్ పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అని అందరికీ తెలిసిందే.  ఇక సుక్కు-దేవీ-బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు రెండూ మ్యూజికల్ హిట్సే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడడం సహజం. అయితే దేవీ ప్రస్తుతం ఉన్న ఫామ్ లో అంచనాలను అందుకోగలడా అనేది మిలియన్ డాలర్స్ ప్రశ్న గా అందరి మదిలో మెదులుతోంది.

అందుకే ఈ సినిమా సంగీతం విషయంలో సుక్కు ఒకటే సూచన ఇచ్చారట. పాటలు ఈ సినిమా కథకు తగ్గట్టుగా ఉండాలని అలాగే సౌండ్ కూడా ఏమాత్రం రొటీన్ గా ఉండకూడదని కండిషన్ పెట్టారట. ఒకరకంగా ఇది దేవి కి స్వీట్ వార్నింగ్ అని కూడా అంటున్నారు. అయితే సుక్కు.. దేవీ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ తోనే ఇలా కండిషన్ పెట్టారని.. ఇది వార్నింగ్ ఎంతమాత్రం కాదని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: