సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హిట్ టాక్ తో దూసుకుపోతున్న సినిమాను ఇంకా విభిన్నంగా ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి, మహెష్ బాబు. సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు అనీల్ రావిపూడి, మహేష్ బాబులను స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తూ బాగా వైరల్ అవుతోంది. మహేష్ బాబు గురించి వెంకటేష్ మాట్లాడిన మాటలు.. వారిద్దరి మద్య సరదా కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. 

 

ఇందులో మేయిన్ హైలెట్ ఏమిటంటే వెంకటేష్.. మహేష్ బాబు లుంగీ డాన్స్ పై హాట్ కామెంట్స్ చేశాడు. సాధారణంగా ఇలాంటి కామెంట్స్ ఇద్దరి అమ్మాయిల మధ్య సరదాగా జరుగుతాయి. కానీ ఇక్కడ రివర్స్ లో జరిగాయి. సరిలేరు లో ఉన్న 'మైండ్ బ్లాక్' సాంగ్ లో మహేష్ బాబును చూసిన అమ్మాయిలు ఔట్ అవుతున్నారు. ఇప్పటిదాకా అందరు హీరోయిన్స్ ను ఎలా అయితే పొట్టి డ్రస్ లు వేసుకుంటే చూస్తారో అలా మైండ్ బ్లాక్ పాటలో మహేష్ బాబును అమ్మాయిలు అలా చూస్తున్నారు.

 

మహేష్ బాబు లుంగీ ఇంకాస్త పైకి ఎత్తితే బాగుండు.. ఆయన కాళ్లు కనిపించేవి అనుకుంటున్నారని వెంకటేష్ సరదాగా కామెంట్స్ చేశాడు. మైండ్ బ్లాంక్ పాటకు మహేష్ మంచి స్టెప్స్ వేశాడని వెంకీ కితాబిచ్చాడు. అయితే ఈ కామెంటే ఇప్పుడు హాట్ టాపిక్ అండ్ వైరల్ అవుతున్నాయి. మామూలుగానే మహేష్ కి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ. ఇక ఇలాంటి సాంగ్స్ చేస్తే ఇక ఇంటిముందు క్యూ కట్టడం ఖాయమన్న కామెంట్స్ కూడా సరదాగా వినిపిస్తున్నాయి. 

 

ఇక మైండ్ బ్లాంక్ పాట గురించి మహేష్ బాబు ... ఒక మంచి మాస్ మసాలా సాంగ్ ను చేయాలని ముందు నుంచే అనుకున్నాం. ఈ పాటను డిజైన్ చేసినప్పుడు నాకు బాగా నచ్చింది. ఈ సాంగ్ ని శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో చేశాం. రెండు మూడు షాట్స్ చేసిన తర్వాత అనీల్ సూపర్ గా వచ్చిందండి. కాస్త ఎక్స్ ప్రెషన్స్ విషయంలో కూడా వైవిధ్యం చూపిస్తే బాగుంటుందని చెప్పాడు. అప్పుడు నేను కొత్తగా ప్రయత్నించాను. దాంతో పాటు స్థాయి మరింత పెరిగిందని మహేష్ బాబు అన్నాడు. నా 20 ఏళ్ల సినీ కెరీర్ లో ఈ పాటకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఎప్పుడు అందుకోలేదని మహేష్ బాబు మురిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: