టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓవర్ ఆల్ గా యావరేజ్ టాక్ ని సంపాదించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు, మిలిటరీ మేజర్ గా నటించిన ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి, దాదాపుగా 13 ఏళ్ల తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫిని అందించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. సాంగ్స్ మంచి సక్సెస్ అవ్వడంతో సినిమాపై ప్రేక్షకుల్లో, మహేష్ ఫ్యాన్స్ లో సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. 

 

ఇకపోతే సినిమాకు గొప్ప టాక్ ఏమి రాకపోయినప్పటికీ, మహేష్ బాబు ఛరిష్మాతో పాటు, పండుగ సీజన్ కావడంతో ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తున్న ఈ సినిమా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ ని చేరుకోవడంతో పాటు, మరికొద్దిరోజుల్లోనే మిగతా ప్రాంతాల్లో కూడా ఆ ఫీట్ ని అందుకోబోతోందట. ఇక ట్రేడ్ విశ్లేషకుల నుండి అందుతున్న సమాచారం  మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పటివరకు రూ.68.47 కోట్ల షేర్ కొల్లగొట్టగా, ప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్ల షేర్ కొల్లగొట్టినట్లు చెప్తున్నారు. 

 

ఇకపోతే సినిమాకు ఈ రేంజ్ లో కలెక్షన్ వస్తుండడంతో నేటి సాయంత్రం సక్సెస్ మీట్ ని వరంగల్ జిల్లా హన్మకొండలో ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. ఇక నిన్న సాయంత్రం సరిలేరు యూనిట్ తిరుపతి చేరుకొని నేటి ఉదయం తిరుమల వేంకటేశ్వరుని దర్శనం చేసుకోనుంది. ఇందుకోసం నిన్న సాయంత్రం మహేష్ సహా సినిమా యూనిట్ సభ్యులు రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకోవడంతో ఫ్యాన్స్ మహేష్ ని చూసేందుకు ఎగబడ్డారు. ఈ విధంగా సూపర్ స్టార్ మహేష్ ఏమాత్రం తగ్గకుండా సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: