టాలీవుడ్ సినిమా పరిశ్రమకు సూపర్ స్టార్ కృష్ణ  గారి సరసన కిలాడీ కృష్ణుడు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి, ఆ తరువాత మెల్లగా అవకాశాలు దక్కించుకుని వాటిని సక్సెస్ లు గా మలుచుకుని హీరోయిన్ గా అనతికాలంలోనే మంచి పేరు గడించారు. అప్పట్లో టాలీవుడ్ లోని దాదాపుగా అందరు స్టార్ హీరోల సరసన నటించిన విజయశాంతి, ఆ తరువాత రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఇక మళ్ళి 13 ఏళ్ళ తరువాత మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు ద్వారా రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. 

 

సినిమా ప్రస్తుతం మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుండడంతో పాటు ఆ సినిమాలో విజయశాంతి పాత్రకు కూడా మంచి పేరు రావడం జరిగింది. ఇకపోతే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, విజయశాంతి తదుపరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు చెప్తున్నారు. అతి త్వరలో పింక్ సినిమా తెలుగు రీమేక్ లో నటించనున్న పవన్, దాని తరువాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారని, మంచి ఆకట్టుకునే కథ, కథనాలతోపాటు ఒక హృద్యమైన మెసేజ్ తో తెరకెక్కనున్న ఆ సినిమాలోని ఒక కీలక పాత్రలో విజయశాంతి నటించనున్నట్లు చెప్తున్నారు. 

 

వాస్తవానికి ఆ క్యారెక్టర్ విషయమై ఇప్పటికే దర్శకుడు క్రిష్ విజయశాంతిని సంప్రదించేందుకు మరొక రెండు రోజుల్లో ఆమెను కలువనున్నారని అంటున్నారు. మంచి కథా బలం ఉన్న సినిమా కావడంతో పాటు, ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో కావడంతో విజయశాంతి కూడా ఆ సినిమాలో నటిస్తారని సమాచారం. అయితే ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: