సంక్రాంతి పండగ వస్తుందంటేనే హైదరాబాద్ సహా అన్నీ ప్రాంతాల వాళ్ళకి ఆంధ్రానే గుర్తుకు వస్తుంది. ఇంకా చెప్పాలంటే భీమవరం, రాజమండ్రి, తాడేపల్లి గూడేం .. ఆంధ్రాలో కోడి పందెంలకు ఫేమస్ అయిన ఊళ్ళు గుర్తొస్తాయి. సంక్రాంతికి కోడి పందేలా జోరు ఎంతో రసవత్తరంగా ఉంటుంది. సాధారణ ప్రజల దగ్గరనుండి రాజకీయ నాయకుల వరకు ఎంతో మంది ఈ కోడీ పందేలలో పాల్గొంటారు. సంక్రాంతి సీజన్ సందర్బంగా వారం రోజులు కోడి పందెలు కాస్తారు. విదేశాల నుండి వచ్చి మరీ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కూడా గోదావరి జిల్లాలో కోడి పందాలు వేసేందుకు వెళ్తారు. ఎంతో మంది స్టార్స్ గతంలో కోడి పందాలు కాసిన విషయం తెల్సిందే. అయితే ఈసారి మాత్రం ఆశ్చర్యకరంగా హైదరాబాద్ లోనే టాలీవుడ్ స్టార్స్ కోడి పందాలు కాసినట్లుగా ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు.

 

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ఫార్మ్ హౌస్ లో ఈసారి కోడి పందాలు జరిగినట్లుగా తాజాగా సమాచారం అందుతోంది. టాలీవుడ్ కి చెందిన పలువురు యంగ్ హీరోల తో పాటు హీరోయిన్స్ కూడా ఈ కోడి పందాల్లో పాల్గొన్నట్లుగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. రెండు రోజుల పాటు జరిగిన ఈ కోడి పందాల్లో లక్షల రూపాయలు చేతులు మారినట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

 

నిర్మాతలు దర్శకులతో పాటు టాలీవుడ్ స్టార్స్ పలువురు పాల్గొన్న ఈ కోడి పందాలకు అనధికారికంగా పోలీసుల నుండి కూడా మద్దతు లభించినట్లుగా సమాచారం. మొత్తానికి కోడి పందాల ఆనవాయితీని హైదరాబాద్ లో కూడా ఆ స్టార్ తీసుకు వచ్చాడని చెప్పుకుంటున్నారు. ముందు ముందు కూడా సంక్రాంతికి హైదరాబాద్ లో కోడి పందాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఈ సారి హైదరాబాద్ లో జరిగిన కోడి పందేలను చూస్తే అర్థమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: