సంక్రాంతి బ‌రిలో విడుద‌లైన చిత్రాల్లో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రం. ఈ చిత్రం సూప‌ర్‌డూపర్ హిట్ అయి బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొడుతుంది. మహేష్ కెరీర్ లోనే ఈ చిత్రం భారీ వసూళ్ళని రాబడుతూ దూసుకు పోతుంది. అయితే ఈ చిత్రం సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకోవడం తో ఈ చిత్ర యూనిట్ తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొనేందుకు ఆ చిత్ర యూనిట్ హైదరాబాద్ నుండి రేణిగుంటకు చేరుకుంది.

 

సినిమా వాళ్ళ‌కి సెంటిమెంట్ ఎక్కువ‌న్నా విష‌యం తెలిసిందే. ఏదైనా సినిమా హిట్ అయితే కంప‌ల్‌స‌రిగా తిరుప‌తి వెళ్ళి శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శంచుకుంటారు. అక్కడి ప్రాంతంలో మహేష్ మరియు ఇతరులతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అయితే రేణిగుంట నుండి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు. మహేష్, నమ్రతలతో పాటుగా, వారి పిల్లలు, విజయశాంతి, దిల్ రాజు, అనిల్ రావిపూడి, రాజేంద్ర ప్రసాద్, అనిల్ సుంకర, వంశీ పైడి పల్లి వున్నారు. అయితే వీరు శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇక ఈ చిత్రం క్లాస్ హిట్టైతే... అల‌వైకుంఠ‌పురంలో మాస్ హిట్ అని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

 

ఇక ఈచిత్రంలోని మ్యూజిక్ ముందు అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయినా త‌ర్వాత త‌ర్వాత ఈ చిత్రంలోని సాంగ్స్ ఊపందుకున్నాయి. మైండ్ బ్లాక్ సాంగ్ మొద‌ట్లో విన్న‌ప్పుడు అంత‌గా అనిపించ‌లేదుగాని విజువ‌ల్‌గా చూస్తే ఆ పాట పిక్చ‌రైజేష‌న్ చాలా అద్భుతంగా కుదిరింద‌నే చెప్పాలి. దేవి మ్యూజిక్ ఈ చిత్రంలో కాస్త లేటుగా ఊపందుకుంద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం మ‌హేష్ ఒక మూడు నెల‌లు గ్యాప్ తీసుకోగా..దిల్‌రాజు పింక్ రీమేక్ చిత్రంతో బిజీ..అనిల్‌రావిపూడి ఎఫ్‌3 చిత్రంతో బిజీ.. ఇక విజ‌య‌శాంతి కూడా ఎఫ్‌3లో ఓ కీల‌క‌పాత్ర‌ను పోషించ‌నున్నార‌ని స‌మాచారం.  నిన్న బ‌య‌లుదేరిన ఈ స‌రిలేరు టీమ్ పద్మావతి నగర్‌లోని శ్రీకృష్ణ అతిథి గృహంలో రాత్రి బస చేయనున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి నిజపాద సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకోనున్నారు. సినిమా విజయం సాధించడంతో స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి చిత్ర యూనిట్‌ సభ్యులు తిరుమలకు వచ్చినట్లు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: