సరిలేరు నీకెవ్వరు సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. అటు ఓవర్సీస్ లోనూ ఈ సినిమా మంచి వసూళ్ళు సాధిస్తుంది. సంక్రాంతి కి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీసును కొల్లగొట్టే దిశగా పరుగులు పెడుతోంది. అయితే ఈ చిత్రం తర్వాఅ మహేష్ వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వంశీ పైడిపల్లితో మహర్షి చేసి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

 

 

ఇప్పుడూ సరిలేరు నీకెవ్వరు తర్వాత మళ్ళీ వంశీతో సినిమా చేస్తున్నాడూ. ఒక హిట్ ఇచ్చిన దర్శకుడితో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయడం మహేష్ కి అలవాటే. గతంలో ఆయన చాల మంది డైరెక్టర్లని రిపీట్ చేశాడూ. త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, గుణశేఖర్ వీరందరితో రెండేసి సినిమాలు చేశాడు. అయితే ప్రస్తుతం అదే ఫార్ములాని ఫాలీ అయిపోతున్నాడూ. అయితే వంశీపైడిపల్లితో సినిమా అనంతరం సినిమా ఎవరితో ఉంటుందనే అనుమానాలకి తెరదించేశాడు మహేష్..

 

 

వంశీ పైడిపల్లితో సినిమా చేశాక మహేష్ మళ్ళీ అనిల్ రావిపూడితోనే జతకట్టాలని చూస్తున్నాడట. ఈ మేరకు సంకేతాలు కూడా ఇచ్చాడు. సరిలేరు..’ ప్రమోషన్లలో భాగంగా మీడియా ప్రోగ్రాములకు తోడు ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ చేశాడు మహేష్. అందులో భాగంగా అనిల్‌తో మళ్లీ సినిమా చేయబోతున్నట్లు చెప్పాడు మహేష్. అనిల్ వేరే సినిమా ఒకటి చేశాక తనతో తీస్తాడని అతను చెప్పాడు. 

 

 

అయితే అప్పటి వరకు వంశీతో సినిమా కంప్లీట్ చేసుకుని మళ్ళీ అనిల్ రావిపూడితో సినిమా చేస్తాడట. దీన్ని బట్టి మహేష్ మరోసారి మాస్ లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. వంశీ పైడిపల్లితో సినిమా గ్యాంగ్ స్టర్ కథతో తెరకెక్కనుంది. మరి ఈ సినిమాలో మహేష్ కొత్తగా కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు విజయయాత్రలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: