గత సంవత్సరం వెళ్లుతు, వెళ్లుతు ఫ్లాపులతో సతమతం అవుతున్న సాయిధరమ్ తేజ్ కు హిట్ అందించి వెళ్లింది. ఇక సంక్రాంతి వస్తూనే ఈ కొత్త సంవత్సరం టాలీవుడ్ పరిశ్రమకు రెండు విజయాలను అందించింది. ఆ విజయం మామూలుగా లేదు ఎందుకంటే కొత్త సంవత్సరం ప్రారంభంలోనే విడుదలైన రెండు చిత్రాలు వంద కోట్ల క్లబ్‌లో చేరడం అనేది ఒకరకంగా టాలీవుడ్ పరిశ్రమకు జీవాన్ని పోసినట్లే. ఇక ముందుగా మహేష్ సరిలేరు నీకెవ్వరుతో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనుకున్నట్లుగానే ఈ సంవత్సరం విజయంతో తొలి బోణి కొట్టాడు.

 

 

ఇక ఆ తర్వాత విడుదలైన అల వైకుంఠపురములో’ అంటూ అల్లు అర్జున్ కూడా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌, సంక్రాంతి బరిలో సూపర్‌ హిట్‌గా నిలిచి ఏకంగా తొలి రోజు 85 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్టుగా సినిమా యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇకపోతే గత కొన్ని చిత్రాల నుండి బన్నీకి కూడా సరైన హిట్ తగల లేదు.

 

 

ఇప్పుడు అల వైకుంఠపురములో’ చిత్రంతో ఆలోటు తీరిందట.. ఇక ఇప్పటికే సాయిధరమ్ తేజ్ కు లభించిన విజయానికి పవన్ కళ్యాణ్ విషెష్ తెలియజేయగా, తాజాగా అల్లు అర్జున్ కు కూడా ఈ జనసేన పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియ చేయడం ప్రస్తుతం ఈ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు చిరంజీవి-రామ్ చరణ్ సినిమాలకు మాత్రమే ఈ విధంగా స్పందిస్తారు.

 

 

కాగా బన్నీ-సాయితేజ్‌ చేసిన సినిమాలకు ఇంతగా రియాక్ట్ కావడంతో ఫిలింనగర్‌లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారిందట. ఇకపోతే ఈ మద్యకాలంలో  మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మద్య వార్ నడుస్తుందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతుంది. ఈ క్రమంలో నిన్న జరిగిన సంక్రాంతి పండగలో బన్నీ తన పెద్ద మామయ్య అయిన చిరంజీవి ఇంటిలో సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగానే, ఇప్పుడు  పవన్ కళ్యాణ్ విష్ చేయడంతో ఇన్నాళ్లు ఉన్న అనుమానాలు పటాపంచలై పోయాయని అనుకుంటున్నారట. ఇక  మెగా అభిమానుల ఆనందానికైతే హాద్దులు లేవు..

మరింత సమాచారం తెలుసుకోండి: