ఈ ఏడాది సంక్రాంతి బరిలో నాలుగు టాప్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి.  రజినీకాంత్, మహేష్ బాబు, అల్లు అర్జున్, కళ్యాన్ రామ్. అల్లు అర్జున్త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురం లో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మరోసారి త్రివిక్రమ్ తన మార్క్ చూపించడం తో సినీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమా పెద్ద విజయం సాధించడం పట్ల చిత్ర యూనిట్ సక్సెస్ సంబరాలు చేసుకుంటుంది. బన్నీ యాక్టింగ్ , డాన్స్ , యాక్షన్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకోవడంతో.. కలెక్షన్లుకూడా భారీగానే వస్తున్నాయి.   

 

సినిమా నైజాం, వైజాగ్ , కృష్ణ , వెస్ట్ , సీడెడ్ , గుంటూరు , నెల్లూరు వంటి ఏరియాల్లో నాన్ బాహబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసినట్లు తెలుస్తుంది. అంతా బాగుంది కానీ.. ఈ మూవీ బాహుబలిని డామినేట్ చేస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 4 రోజులకే నాన్-బాహుబలి రికార్డులు క్రియేట్ అయినట్టు ప్రకటించుకున్నాడు అల్లు అర్జున్. దీంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. ఇది కాస్త అత్యుత్సాహమే అవుతుంది. సైరా, సాహో, రంగస్థలం లాంటి సినిమాల్ని కాదని, 4 రోజులకే వాటిని అధిగమిస్తూ.. నాన్-బాహుబలి రికార్డులు క్రియేట్ చేశామని యూనిట్ ప్రకటించడమే నిజంగా తొందరపాటు చర్యే అవుతుంది. అల యూనిట్ ఏకంగా అధికారికంగా పోస్టర్ విడుదల చేసింది.

 

బాహుబలి 2 జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.  దేశ విదేశాల్లో ఎన్నో సంచలనాలు సృష్టించిన బాహుబలి మూవీ రికార్డు బ్రేక్ అంటూ ఫ్యాన్స్ హంగామా అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో 7 ఏరియాల్లో తమ సినిమా నాన్-బాహుబలి రికార్డుల్ని క్రియేట్ చేసిందని చెప్పుకుంది యూనిట్. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఒక్క ఈస్ట్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో అల వైకుంఠపురం రికార్డులు సృష్టించిందని చెప్పుకున్నారు. మరి మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా పరిస్థితేంటి? ఈ సినిమా కూడా నైజాంలో రికార్డు సృష్టించినట్టు చెప్పుకుంటున్నారు మేకర్స్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఏరియాల్లో లెక్కలు తేడా కొడుతున్నాయని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: