నిర్మాత దిల్ రాజ్ కు ఈ సంక్రాంతి కలసి వచ్చినంతగా గతంలో ఏ సంక్రాంతి కలిసిరాలేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ సంక్రాంతి పండుగకు విడుదల అయిన రెండు భారీ సినిమాలపై దిల్ రాజ్ గోల్డెన్ హ్యాండ్ పడింది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు దిల్ రాజ్ సహ నిర్మాతగా వ్యహరిస్తే ‘అల వైకుంటపురములో’ మూవీకి సంబంధించిన నైజాం ఉత్తరాంధ్ర జిల్లాలకు దిల్ రాజ్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు.

దీనితో ఈ సంక్రాంతికి విడుదల అయిన ఈ రెండు భారీ సినిమాల పై దిల్ రాజ్ 60 కోట్ల జూదం ఆడి రిస్క్ చేస్తున్నాడు అంటూ చాలామంది ఇండస్ట్రీలోని వ్యక్తులు దిల్ రాజ్  సాహసం పై కామెంట్స్ చేసారు. అయితే ఎవరు  ఊహించని విధంగా ‘సరిలేరు నీకెవ్వరు’ కు డివైడ్ టాక్ వచ్చినా ఈమూవీ కలెక్షన్స్ విషయంలో సంతృప్తి కరంగానే దూసుకు పోతోంది. ఇక ‘అల వైకుంఠపురముకు’ వచ్చిన పాజిటివ్ టాక్ తో ఈ మూవీ దిల్ రాజ్ కు నైజాం ఏరియాలో కాసులు కురిపిస్తోంది. 

వాస్తవానికి ‘అల వైకుంఠపురములో’ మూవీకి విడుదలకు ముందు నుంచి పాజిటివ్ టాక్ ఉన్నా ‘సరిలేరు నీకెవ్వరు’ పోటీని పరిగణలోకి తీసుకుని ఈ మూవీని భారీ మొత్తలకు కొనడానికి చాలమంది బయ్యర్లు జంకారు. దీనితో ‘అల’ మూవీ బయ్యర్లు వారు ఊహించన మొత్తం కన్నా తక్కువ మొత్తానికి ‘అల’ నైజాం రైట్స్ ను దిల్ రాజ్ కు అమ్మవలసి వచ్చింది అన్న వార్తలు ఉన్నాయి. 

దీనితో ‘అల వైకుంఠపురము’ వల్ల దిల్ రాజ్ కు విపరీతమైన లాభాలు వస్తే ‘సరిలేరు నీకెవ్వరు’ తో ఒక మోస్తరు లాభాలతో దిల్ రాజ్ బయట పడ్డారు అంటూ ఇండస్ట్రీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా పవన్ రీ ఎంట్రీ మూవీ ‘పింక్’ రీమేక్ కు కూడ దిల్ రాజ్ నిర్మాతగా వ్యహరిస్తున్న పరిస్థితులలో పవన్ మ్యానియాను ఆధారం చేసుకుని ఈ మూవీకి దిల్ రాజ్ తన తెలివితేటలతో భారీ బిజినెస్ చేసే ఆస్కారం ఉంది. దీనితో ఈ ఏడాది దిల్ రాజ్ కు టాప్ హీరోలు అంతా బంగారు బాతులా మరిపోయారు అంటూ దిల్ రాజ్ డబల్ గోల్స్ మాస్టర్ ప్లాన్ కు షాక్ అవుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: