తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి' పురిచ్చి తలైవి' జయలలిత  జీవిత  చరిత్ర  ఆధారంగా   ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న చిత్రం తలైవి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్  కంగనా రనౌత్ ,ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో  లెజండరీ యాక్టర్&మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పాత్రలో  ప్రముఖ నటుడు అరవింద స్వామి కనిపించనున్నాడు. ఇక ఈరోజు  ఎంజీఆర్ 103వ జయంతి సందర్భంగా ఈ చిత్రం నుండి అయన లుక్ ను విడుదలచేశారు.  ఈ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ స్టిల్ లో  అచ్చం ఎంజీఆర్ లాగే కనిపించాడు అరవింద స్వామి.  ఇక ఆయనతోపాటు  ఈ చిత్రంలో శశికళ పాత్రలో ప్రియమణి నటిస్తుంది. 
 
ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ అందిస్తున్న ఈ చిత్రాన్ని విబ్రి మీడియా పతాకం పై   విష్ణు ఇందూరి నిర్మిస్తున్నాడు.   హిందీ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళ్ తోపాటు తెలుగు లోనూ  విడుదలకానుంది.  కాగా తమిళ , తెలుగు వెర్షన్ లకు 'తలైవి' అనే టైటిల్ ను ఖరారు చేయగా హిందీ వెర్షన్ కు మాత్రం 'జయ' అనే టైటిల్ ను పెట్టారు. జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూన్ 26న  విడుదలకానుంది. 
 
ఇదిలా ఉంటే లేడీ డైరెక్టర్ ప్రియదర్శి డైరెక్షన్ లో జయలలిత  జీవిత చరిత్ర ఆధారంగా మరో బయోపిక్ తెరకెక్కతుంది.  ది ఐరన్ లేడీ అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రంలో  నిత్య మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తుంది.  ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఫిబ్రవరి 20న  తమిళ్ తోపాటు తెలుగు , కన్నడ ,హిందీ లో ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: