చాలా కాలం నుండి వరుస ప్లాప్ సినిమాలతో రాణిస్తున్న రవితేజ కు ఏడాది నుండి ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు..అందుకే ఈ సారి కొంచెం లెట్ అయిన పర్వాలేదని అనుకున్న యితగాడు భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమానే డిస్కో రాజా..వి ఐ ఆనంద్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతుంద.. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 24న ప్రేక్షకులను రాబోతుంది..

 

అయితే..పదేళ్ల క్రితం ‘కిక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చారు రవితేజ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తరవాత మళ్లీ అంతటి హిట్‌ను అందుకోలేదు రవితేజ. ‘కిక్’ తరవాత 2015 వరకు 13 సినిమాలు చేశారు రవితేజ. వీటిలో డిజాస్టర్లే ఎక్కువ. ‘బలుపు’, ‘పవర్’, ‘బెంగాల్ టైగర్’ సినిమాలు పర్వాలేదనిపించినా రవితేజ మార్కెట్‌ను పెంచుకోలేకపోయాయి.

 

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం డిస్కో రాజా సినిమా షూటింగ్ న పూర్తి చేసే పనిలో ఉన్నాడు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రవితేజా ఆశలన్నీ ఈ సినిమా పైనే ఉన్నాయి. గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమౌతున్న రవితేజ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. వరస పరాజయాలతో ఉన్న మాస్ రాజాకు అనీల్ రావిపూడి 'రాజా ది గ్రేట్' కొంత ఊరటను ఇచ్చింది. ఆ  సినిమా తర్వాత మళ్ళీ రవితేజను ఫ్లాపులు పలకరిస్తున్నాయి. విఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నాబా నటేష్ ,పాయల్ రాజ్ పుత్  హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

 

తాజగా ఓ ఇంటర్వ్యూలో రవితేజ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు. తాను కమర్షియల్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతానని, అందుకే కిక్, విక్రమార్కుడు వంటి సినిమాలు చేసానని చెప్పారు. అదే విధంగా నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో వంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేయడం ఇష్టమని..  కానీ అవి ప్రేక్షకాదరణ పొందలేదని అన్నారు. సినిమాలో కొత్తదనం, కొత్త కాన్సెప్ట్ లేకపోతే  ప్రేక్షకులు చూడటం మానేశారు.  పాత్ర భిన్నంగా ఉంటే విలన్ పాత్రలు చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్న అని రవితేజ చెప్పుకొచ్చారు. మరి రవితేజ మాటలు చూస్తుంటే త్వరలో విలన్ గా మెపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: