విప్లవ దర్శకులు టి కృష్ణ తనయుడు గోపిచంద్ హీరోగా ‘తొలివలపు’ మూవీతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ మూవీ పెద్దగా హిట్ కాకపోవడంతో కెరీర్ కొనసాగించే క్రమంలో విలన్ అవతారం ఎత్తాడు.  జయం, వర్షం, నిజం మూవీస్ లో విలన్ గా నటించిన గోపిచంద్ హీరో స్థాయిలో మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత హీరోగా  రణం, యజ్ఞం, శౌర్యం, శంఖం, లక్ష్యం, లౌక్యం సినిమాలతో మంచి విజయాలు అందుకున్న గోపిచంద్ ‘జిల్’ సినిమా తర్వాత వరుస గా అపజయాలో పొందారు.  ఒకదశలో ఈ హీరో కెరీర్ ముగిసినట్లే అని అనుకున్నారు.. కానీ గత ఏడాది చాణుక్య మూవీతో కాస్త పరవాలేదు అనిపించుకున్నాడు.  హీరోగా పెద్దగా సక్సెస్ లు తన ఖాతాలో వేసుకోకున్నా కెరీర్ మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాల్లో నటిస్తున్నారు.

 

 తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ ,  మిల్క్ బ్యూటీ తమన్నా  నటిస్తున్న కొత్త సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకుంది.  గతంలో గౌతమ్ నంద, గోపిచంద్  కాంబినేషన్ లో ‘గౌతమ్ నంద’ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.  కంటెంట్ బాగున్న ఈ సినిమా పెద్దగా సక్సెస్ టాక్ మాత్రం తెచ్చుకోలేక పోయింది.  ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరుపుకుంటుంది.. గోపీచంద్ 'చాణక్య' స్పై థ్రిల్లర్ లాంటి హిట్ తో మంచి జోష్ లోనే ఉన్నారు. ఈ మూవీ  కబడ్డీ కోచ్ గా గోపి చంద్ కనిపించనున్నాడని తెలుస్తుంది.  ఈ మద్య కాలాంలో క్రీడా నెపథ్యంలో వస్తున్న సినిమాలకు మంచి ఆదరణ పెరిగిన విషయం తెలిసిందే.  

 

ఆ మద్య నాని నటించిన ‘జెర్సీ’, నాగ చైతన్య నటించిన మజిలీ రెండూ క్రీడా నెపథ్యంలో తెరకెక్కిన మూవీలు కావడం విశేషం. గోపి చంద్ సరసన తొలిసారిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. ఈ మూవీలో స్పోర్ట్స్ విమెన్ గా చేస్తున్నారని సమాచారం.  సంక్రాంతి పండుగను పురస్కరించుకొని దర్శకుడు సంపత్ నంది ఓ మేకింగ్ వీడియో విడుదల చేశారు.  ఆత్రేయ పురం అనే ఓ పల్లెటూరి సెట్స్ లో ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా, ఈ మూవీలో ఓ కీలక పాత్రలో రావు రమేష్ కనిపించబోతున్నారట.  ఈ మూవీ సక్సెస్ పై దర్శకుడు సంపత్ నంది, హీరో గోపిచంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు టాలీవుడ్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: