టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఇటీవల బాహుబలి రెండు భాగాల సక్సెస్ ల తరువాత నటించిన సాహో సినిమాతో ఒకింత ఫ్లాప్ ని చవిచూడవలసి వచ్చింది. యువి క్రియేషన్స్ బ్యానర్ పై యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా, ప్రేక్షకుల, అభిమానుల అంచనాలు ఏ మాత్రం అందుకోలేకపోయింది. ఖర్చు మాత్రం ఎంతో భారీగా పెట్టిన ఆ సినిమాలో ఆకట్టుకునే కథ, కథనాలు లేకపోవడంతో చాలా మంది ప్రేక్షకులు సినిమాపై పెదవి విరిచారు. ఇక ఆ సినిమా పరాజయంతో ఒకింత ఆలోచనలో పడ్డ ప్రభాస్

 

తదుపరి నటిస్తున్న జాన్ మూవీ పై మరింత శ్రద్ధ కనబరిచి నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో గోపీచంద్ తో జిల్ మూవీ తీసిన రాధాకృష్ణ దర్శకత్వంలో యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు ఎంతో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక కాసేపటి క్రితం ప్రభాస్సినిమా తాజా షెడ్యూల్ గురించి ఒక ఫోటోని పోస్ట్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ట్వీట్ చేశారు. నా సినిమా తాజా షెడ్యూల్ నేటి నుండి ప్రారంభం కాంబోతోంది, ఎంతో ఫన్నీ గా సాగే ఈ షెడ్యూల్ కోసం నేను కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను అంటూ సెట్స్ నుండి ఒక పోస్టర్ ని పోస్ట్ చేసారు. 

 

ఇక ప్రస్తుతం ఆ పోస్ట్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. కాగా ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతికనిపుణుల వివరాలు పూర్తిగా వెల్లడి కావలసి ఉంది. అందుతున్న కొన్ని టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి అయిందని, అలానే సినిమాని ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. సాహో తో ఫ్యాన్స్ ని నిరాశ పరిచిన ప్రభాస్, ఈ సినిమాతో ఎంతమేర సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి.....!! 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Elated to share that I’m resuming shooting for my upcoming film. Looking forward to a fun schedule.

A post shared by Prabhas (@actorprabhas) on

మరింత సమాచారం తెలుసుకోండి: