టాలీవుడ్ సినిమా పరిశ్రమకు నాగచైతన్య సరసన ఒక లైలా కోసం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన పూజ హెగ్డే, తొలి సినిమాతో పెద్దగా సక్సెస్ ని అందుకోలేకపోయింది. ఆ తరువాత యువ హీరో వరుణ్ తేజ్ సరసన ముకుందలో నటించినప్పటికీ ఆ సినిమా కూడా సక్సెస్ కాలేదు. అనంతరం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన మొహెంజెదరో సినిమాలో నటించినప్పటికీ అది కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో పూజ ఆశలు అడియాశలయ్యాయి. 

 

ఇక ఆ తరువాత బన్నీ సరసన ఆమె నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా యావరేజ్ గా ఆడడంతో ఆ సినిమా పూజకు ఒకింత పేరు రావడం జరిగింది. ఆపై ఎన్టీఆర్ తో అరవింద సమేత, వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్, సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి సినిమాల్లో నటించి వరుసగా మూడు సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్న పూజ, ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన అలవైకుంఠపురములో సినిమాలో హీరోయిన్ గా నటించి మరొక సక్సెస్ ని దక్కించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ భామగా మారిన పూజకు ఇప్పటికే వరుసగా అవకాశాలు వస్తున్నాయి. 

 

అందులో భాగంగా అతి త్వరలో పవన్ కళ్యాణ్ నటించబోయే పింక్ మూవీ రీమేక్ లో పూజ హీరోయిన్ గా నటించబోతున్నట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో సమంత నటిస్తుందని ఇటీవల వార్తలు రాగా, ఆమె ఫుల్ బిజీగా ఉండడంతో నటించడం లేదని, అయితే దర్శక నిర్మాతలు ఆ పాత్రకు పూజ అయితేనే బాగుంటుందని నిశ్చయించి ఆమెను నేడో, రేపో కలిసి కథ వినిపించాలని అనుకుంటున్నట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: