సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు రజినీ, మహేష్ బాబు, అల్లు అర్జున్, కళ్యాన్ రామ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి.  ప్రతి సంక్రాంతి కోడి పందాల్లా టాలీవుడ్ లో పెద్ద సినిమాల ఫైట్ ఉంటూనే ఉంది.  అయితే ఈ ఏడాది భారీ అంచనాల మద్య వచ్చిన రజినీకాంత్ ‘దర్బార్’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పేరు తెచ్చుకోలేదు. ఈ సినిమాలో మహేష్ చాలా కాలం తరువాత మాస్‌ రోల్‌లో కనిపించటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అంతే కాదు ఈ మూవీలో మరో ప్రత్యేకత ఏంటంటే పదమూడేళ్ల తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటించింది. 

 

ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు.  అయితే ఈ మూవీలో రష్మిక మందన తన మేనరీజంతో ఆకట్టుకుంది.  నీకు అర్థమవుతుందా.. అంటూ నోటి వద్ద చేయి పెట్టుకొని అమాయకంగా అందరినీ అడుగుతుంది.. ఇది సినిమాలో హెలెట్ కామెడీ పండించింది. ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్ మూమెంట్స్ భలే ఉన్నాయి. తాజాగా మహేష్ బాబు కూతురు సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య కలిసి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

తాజాగా ‘దేవుడా.. ఒక క్యూట్, స్వీట్, హ్యాండ్సమ్ కుర్రోణ్ణి చూపించవయ్యా.. నీకు అర్థమవుతుందా’ అంటూ రష్మికను వీళ్లిద్దరూ భలే ఇమిటేట్ చేశారు. ఆద్య, సితార పాప ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే అమ్మో వీరిద్దరూ పిల్లలు కాదు.. చిచ్చర పిడుగులు అనేలా ఉన్నారు.  మొత్తానికి ఓ హీరో కూతురు గా సితార, ఓ దర్శకుడి కూతురుగా ఆద్య తమ వారసత్వాన్ని నిరూపించుకుంటన్నారు.  గతంలో కూడా ఈ చిన్నారులు చేసిన అల్లరి వీడియోలు ఎన్నో వైరల్ అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: