కిరిక్ పార్టీ అనే సినిమాతో కన్నడ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోయిన్ రష్మిక మందన్న, అక్కడ ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ కొట్టింది. ఆ తరువాత తెలుగులో వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన చలో సినిమాతో హీరోయిన్ గా ఇక్కడ అడుగుపెట్టిన రష్మిక, ఇక్కడ కూడా తొలి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకుంది. ఇక ఆ తరువాత విజయ్ దేవరకొండతో గీత గోవిందం సినిమా చేసి, దానితో మరొక సూపర్ హిట్ ని దక్కించుకున్న రష్మిక, అనంతరం ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు లో ఛాన్స్ కొట్టేసింది. 

 

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం బన్నీ, సుకుమార్ ల సినిమాతో పాటు నితిన్ సరసన భీష్మ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ భామ ఇంటిపై మొన్న సంక్రాంతి పండుగ నాడు ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన విషయం బయటకు వచ్చింది. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేట లో ఉన్న రష్మిక ఇంటి డాక్యుమెంట్లను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ వారి నుండి వార్త వస్తోంది. ఆమె ఇంటికి సంబంధించి ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు రష్మిక తల్లిదండ్రులు సరిగ్గా సమాధానం చెప్పలేకపోవడంతో అధికారులు ఆ ఇంటి పత్రాలను, దానితో పాటు రూ.25 లక్షలు డబ్బు కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్నారు. 

 

ఇక చలో తరువాత ఎక్కువగా హైదరాబాద్ లో కూడా మధ్యలో నివాసం ఉంటున్న రష్మిక, ఎప్పటికప్పుడు పెట్టిన ఖర్చుల తాలూకు అకౌంట్స్ అన్ని కూడా ఆమె పీఏ ఐటి అధికారులకు చూపారని సమాచారం. అయితే తనపై ఐటి సోదాల విషయమై రష్మిక కు లేట్ గా సమాధానం అందిందని, కాగా అప్పటికే అధికారులు కర్ణాటకలోని ఆమె ఇంటికి వెళ్లడం, సక్రమంగా లెక్కలు చూపకపోవడంతో ఇంటి పత్రాలు, డబ్బును వారు స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్నారు. మరి ఈ విషయమై మున్ముందుకు ఏ విధంగా రష్మిక ఏ విధంగా ముందుకు నడువనుందో చూడాలి....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: