టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించగా సంగీత, బండ్ల గణేష్, రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, సత్య దేవ్, జయప్రకాశ్ రెడ్డి, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించడం జరిగింది. మంచి మాస్

 

యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అంశాలు కలబోతగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాపై మొదటి రోజు ఒకింత మిశ్రమ స్పందన లభించినప్పటికీ, ఎప్పటినుండో సూపర్ స్టార్ మహేష్ ని ఎలాగైతే ఫ్యాన్స్ చూడాలని కోరుకుంటున్నారో ఆ విధంగా ఈ సినిమాలో ఆయనను దర్శకుడు అనిల్ చూపించడంతో పాటు, సంక్రాంతి పండుగా సీజన్ కూడా కావడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఇక నేటికి ఈ సినిమా రిలీజ్ అయి ఏడు రోజులు గడవడంతో, మొత్తం ఈ ఏడురోజుల్లో, అనగా తొలివారం గడిచే సరికి ఏకంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మొత్తం రూ.100 కోట్ల షేర్ ని రాబట్టి సరికొత్త రికార్డు ని నెలకొల్పడం జరిగింది. 

 

ఇక నిన్న వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్ లో రూ.100 కోట్ల షేర్ పోస్టర్ ని సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. అలానే పలు ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ దాటేసిందని, మరికొన్ని చోట్ల అతి కొద్దిరోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని అందుకోబోతోందని చెప్పడం జరిగింది. ఇది ప్రేక్షక విజయం అని, ఫ్యాన్స్, ప్రేక్షకులు ఇంతలా సినిమాని ఆదరిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని, ఈ విజయానికి ముఖ్య కారకుడు ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి అని మహేష్ బాబు మాట్లాడుతూ చెప్పారు. మరి ఈ సినిమా మున్ముందు ఇంకెంత మేర కలెక్షన్ కొల్లగొడుతుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: