టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోలుగా ఇటీవల వారు నటించిన సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురములో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. సరిలేరు మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా మాస్ అంశాలతో  తెరకెక్కితే, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ కలబోతగా అలవైకుంఠపురములో తెరకెక్కింది. సరిలేరును అనిల్ రావిపూడి తెరకెక్కించగా, అల సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. ఈనెల 11న సరిలేరు, 12న అలవైకుంఠపురములో రిలీజ్ అయి రెండు కూడా మంచి టాక్ ని సంపాదించాయి. నిజానికి ఈ రెండు సినిమాలకు కూడా సూపర్ డూపర్ హిట్ టాక్ అయితే రానప్పటికీ, మంచి టాక్ మాత్రం లభించింది అనే చెప్పాలి. ఇకపోతే సంక్రాంతి సీజన్ కావడంతో రెండు సినిమాలు కూడా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్ తో అదరగొడుతూ దూసుకెళ్తున్నాయి. 

 

అలానే రెండు సినిమాలు కూడా దాదాపుగా చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ ని చేరుకోవడంతో పాటు పలు రికార్డ్స్ కూడా కొల్లగొడుతూ ముందుకు సాగుతున్నాయి. సరిలేరు నీకెవ్వరు నిర్మాతలు తమ సినిమాని బ్లాక్ బస్టర్ కా బాప్ అంటూ పోస్టర్స్ లో ప్రకటిస్తుండగా, అలవైకుంఠపురములో సినిమా యూనిట్ తమ సినిమాను సంక్రాంతి విన్నర్ అంటూ పోస్టర్స్ పై వేస్తున్నారు. ఈ విషయమై అసలు ఏ సినిమా ఎంత మేర సక్సెస్ సాధించిందో అంటూ అర్ధం కాక కొందరు ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు. అయితే కొందరు ట్రేడ్ విశ్లేషకుల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఓవర్సీస్ ప్రాంతంలో అలవైకుంఠపురములో ఒకింత పైచేయితో ముందుకు సాగుతోంది. త్రివిక్రమ్ కు అక్కడ మంచి క్రేజ్ ఉండడం, అలానే బన్నీ కి కూడా అక్కడ మంచి పేరు ఉండడంతో పాటు, 

 

అల సినిమా మంచి క్లాస్ ఎంటర్టైనర్ కావడంతో అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాకు మొగ్గుచూపుతున్నారు. ఇక సరిలేరు సినిమాలో మాస్, ఎంటర్టైన్మెంట్ అంశాలు ఎక్కువగా ఉండడంతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల సరిలేరు సినిమా ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. ఇక మహేష్ బాబు చరిష్మా, ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మొత్తంగా చెప్పాలంటే రెండు సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు సాగుతుండడంతో, ఓవరాల్ గా క్లోసింగ్ కలెక్షన్స్ బయటికొచ్చాకే రెండిట్లో ఏది ఎంత మేర కొల్లగొట్టిందో, ఎంత మేర సక్సెస్ సాధించిందో చెప్పగలం అని అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: