టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, చిన్నప్పుడే బాలనటుడిగా సినిమాల్లోకి రంగప్రవేశం చేసి పలు సినిమాల్లో నటించడం జరిగింది. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటవారసత్వంతో సినిమాల్లోకి అడుగుపెట్టిన మహేష్, ఆ వయసులోనే తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను మెప్పించారు. బాలచంద్రుడు సినిమాతో సినిమాలకు విరామం ప్రకటించిన మహేష్, చాలా గ్యాప్ తరువాత 1999లో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా మారి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఆ సినిమా అతి పెద్ద విజయాన్ని అందుకుని, ఫస్ట్ మూవీ తోనే మహేష్ కు విపరీతమైన పేరు తీసుకువచ్చింది. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ మెల్లగా పేరు, 

 

ఇమేజ్, మార్కెట్ ను పెంచుకుంటూ ముందుకు సాగిన మహేష్, నేడు టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక ఇటీవల భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుస విజయాలు అందుకుని ముందుకు సాగుతున్న సూపర్ స్టార్, ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ కి చేరువ అవుతూ ఉంటారు. ఇకపోతే ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు సక్సెస్ తో మంచి జోష్ మీదున్న సూపర్ స్టార్, సినిమాని వీలైనంత ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. ఇక అందులో భాగంగా నిన్న సాయంత్రం ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో కాసేపు చాట్ కార్యక్రమం నిర్వహించారు. 

 

అందులో భాగంగా పలువురు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు మహేష్ సమాధానాలు ఇవ్వడం జరిగింది. అయితే అందులో ఒక అభిమాని, సర్ మీకు ఇష్టమైన డిష్ ఏదో చెప్పండి అని ప్రశ్నించగా, తనకు అన్నంలో పప్పుచారు వేసుకుని తినడం అంటే ఇష్టం అని మహేష్ సమాధానం ఇచ్చారు. ఇక ఆ మాటతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఒకింత షాక్ అయ్యారు అనే చెప్పాలి. అంత పెద్ద సూపర్ స్టార్ అయి ఉండి కూడా పప్పు చారు తన ఫేవరెట్ అని చెప్పడం చూస్తుంటే, మహేష్ బాబు మనవలె సాదాసీదాగా లైఫ్ ని గడుపుతారని, అలానే మనం తినే వంటలే ఎక్కువగా తింటారని అర్ధం అవుతోందని అంటూ కామెంట్స్ చేస్తున్నారు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: