మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు, మొదట్లో చిరంజీవితో కలిసి అక్కడక్కడా కొన్ని సినిమాల్లో నటించడం జరిగింది. అయితే ఆ తరువాత నిర్మాతగా మారి తన అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పలు సినిమాలు నిర్మించి మంచి సక్సెస్ లు అందుకున్న నాగబాబు, కొన్నేళ్ల క్రితం ఈటివి లో ప్రారంభం అయిన జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ఆడియన్స్ కి ఎంతో చేరువయ్యారు. దాదాపుగా ఏడేళ్లుగా ఆ షోలో జడ్జిగా పని చేసిన నాగబాబు, ఇటీవల ఆ షోలోని కొందరు నిర్వాహక సభ్యుల ప్రవర్తన తనకు నచ్చకపోవడంతో దాని నుండి బయటకు వస్తున్నట్లు ఒక వీడియో బైట్ ద్వారా చెప్పడం జరిగింది. 

 

ఆ తరువాత జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అయిన అదిరింది అనే షో ద్వారా జడ్జిగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు, ఆ షోకు తనతో పాటు జబర్దస్త్ నుండి చమ్మక్ చంద్ర ను తీసుకురావడం జరిగింది. అయితే మొదట్లో అందరూ కూడా అదిరింది షో నిజంగానే అదరగొడుతుందని భావించారు, కానీ షాకింగ్ రేంజ్ లో చాలా తక్కువ స్థాయిలో ఆ షోకు రేటింగ్స్ రావడంతో పాటు, జబర్దస్త్ దరిదాపులకు కూడా ఆ షో చేరలేకపోవడంతో నాగబాబు సహా షో నిర్వాహకులు కూడా మరింతగా ఆలోచనలో పడ్డారట. అయితే గతంతో పోలిస్తే గత వారం నుండి షోకు మంచి రేటింగ్స్, రెస్పాన్స్ వస్తున్నాయని, కానీ అది తాము ఆశించిన రేంజ్ కి సరిపోదని భావించిన నాగబాబు, ఒక కొత్త ఆలోచన చేసారట. 

 

ముందుగా ఇటీవల మరికొందరు జబర్దస్త్ సభ్యులను షోలోకి తీసుకువచ్చేందుకు వారితో మాట్లాడిన నాగబాబు, అన్ని విషయాలు మాట్లాడి డీల్ సెట్ చేయడానికి మరికొంత సమయం పడుతుందని భావించి, ఈలోపుగా పటాస్ షో ద్వారా మంచి పేరు సంపాదించిన యాదమ రాజు, సద్దాం లను అదిరింది షోకు తెచ్చేందుకు ప్లాన్ చేశారట. అలానే వారికి ఒక టీమ్ కేటాయించారని, ఇక రాబోయే రోజుల్లో అదిరింది షోను మరింత సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లేలా పక్కాగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ విధమైన నాగబాబు మాస్టర్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: