గత ఏడాది ఒక్క సినిమాతో కూడా  ప్రేక్షకులముందుకు రాలేకపోయింది  స్టార్ హీరోయిన్ అనుష్క.  బాహుబలి 2 తరువాత భాగమతి తో సూపర్ హిట్ కొట్టిన ఆమె  ఈ చిత్రం తరువాత చాలా గ్యాప్ తీసుకొని 'నిశ్శబ్దం' అనే  చిత్రంలో నటించింది.  ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం  ఈఏడాది జనవరి 31న తెలుగు తోపాటు  తమిళహిందీ, ఇంగ్లీష్ భాషల్లో  విడుదలకావాల్సి వుంది.
 
అయితే  ఇప్పుడు ఈ విడుదలను వాయిదా వేశారట మేకర్స్. అందుకే ఎలాంటి ప్రమోషన్స్ చేయడం లేదు చిత్ర యూనిట్. అయితే విడుదల వాయిదా పడడానికి కారణాలు తెలియాల్సి వుంది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలోఆ అనుష్క  మ్యూట్ ఆర్టిస్ట్ గా  కనిపించనుంది. ఆమె పాత్ర సినిమాకు హైలైట్ కానుందని సమాచారం
 
 హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో  తమిళ నటుడు మాధవన్ మరో లీడ్ రోల్ లో నటించగా   ప్రముఖ నటుడు సుబ్బరాజు,  అంజలి , అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే తో పాటు ప్రముఖ  హాలీవుడ్ నటుడు  మైఖేల్ మాడిసన్  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  ఈ సినిమా షూటింగ్  అంత  యూఎస్ లోని సియాటెల్ లోనే జరిగింది. 
 
ప్రముఖ మలయాళీ సంగీత దర్శకుడు  గోపి సుందర్  సంగీతం అందిస్తుండగా   కోన ఫిలిం కార్పొరేషన్ ,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై  కోన వెంకట్, టిజి విశ్వ ప్రసాద్  ఈచిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక   ఈచిత్రం తరువాత  అనుష్క ఇప్పటివరకు తెలుగులోనే కాదు మరే ఇతర భాషలో  మరో సినిమాకు సైన్ చేయలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: