టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే పూజా హెగ్డే పేరే వినిపిస్తుంది. అల వైకుంఠపురంలో సినిమాతో సూపర్ హిట్ ను ఈ బక్క పలచని బ్యూటీ దక్కించుకుంది. మరో వైపు ప్రభాస్ కు జోడీగా జాన్ సినిమాలోనూ నటిస్తున్న విషయం తెల్సిందే.  అంతేకాదు చాలా మంది పూజా కోసం క్యూలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పలువురు స్టార్ హీరోలతో కూడా ఈ బ్యూటి ఈ ఏడాదిలో నటించే అవకాశం ఉన్నట్ట్లు కనిపిస్తోంది. ఒక వైపు టాలీవుడ్ లో వరుసగా పెద్ద స్టార్ హీరోలతో నటిస్తూనే మరో వైపు బాలీవుడ్ వైపు కూడా ఆశగా చూస్తూనే ఉంది. ముందు నుంచి పూజాకి బాలీవుడ్ అంటే యమా మోజు. అందుకే టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసినప్పటికి బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సినిమాలో ఛాన్స్ రాగానే ఫ్లైటెక్కేసింది. దాదాపు రెండేళ్ళు టాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఐతే మొహంజాదారో డిజాస్టర్ అయితే గాని టాలీవుడ్ అంటే ఏంటో తెలీలేదు. 

 

ఇక తాజాగా ఈ అమ్మడికి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న బచ్చన్ పాండీ సినిమాలో ఛాన్స్ దక్కిందని బాలీవుడ్ మీడియా సమాచారం. ఫర్హద్ షామ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ పాత్రలో పూజా హెగ్డే నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అక్షయ్ కుమార్ ప్రస్తుతం చాలా సక్సెస్ ఫుల్ హీరోగా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్స్ ని అందుకుంటున్నాడు. ఆయన సినిమాల్లో నటించడం అంటే సక్సెస్ ను దక్కించుకోవడమే అన్న ఆలోచనతోనే పూజా ఓకే చెప్పిందట.

 

అక్షయ్ కుమార్ సినిమా అనగానే సెకండ్ హీరోయిన్ అయినా కూడా పూజా హెగ్డే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతూనే ఉంది. త్వరలోనే ఈ సినిమాలో పూజా అక్షయ్ తో జత కట్టబోతుంది. పూజా హెగ్డే బాలీవుడ్ లో మొదటి నుండి కూడా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సినిమాతో అయినా బాలీవుడ్ తో హిట్ పడుతుందేమో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: