పూజ హెగ్డే మొదట బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుని అదృష్టవశాత్తూ వరుణ్ తేజ్ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. అక్కడి నుండి గ్లామర్ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది పూజా హెగ్డే అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

తాజాగా ఆమె నటించిన అల వైకుంఠ పురం లో చిత్రం సూపర్ హిట్ కావడంతో అమ్మడు తీసుకునే పారితోషికం కూడా భారీగా పెరిగిపోయింది. అలాగే మరో వైపు ప్రభాస్ కు జోడీగా 'జాన్' చిత్రంలోనూ పూజ నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఏడాది మొత్తం స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసిన పూజా హెగ్డే వరుసగా టాలీవుడ్ లో భారీ ప్రాజెక్టులు అందుకుంటూనే బాలీవుడ్ వైపు కూడా ఒక కన్నేసి ఉంచుతుంది.

 

తాజాగా అమ్మడికి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న బచ్చన్ పాండీ చిత్రంలో ఛాన్స్ దక్కింది. ఫర్హద్ షామ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ పాత్రలో అమ్మడు నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అక్షయ్ కుమార్ ప్రస్తుతం చాలా సక్సెస్ ఫుల్ హీరోగా ఉన్నాడు. ఆయన సినిమాల్లో నటించడం అంటే సక్సెస్ ను దక్కించుకోవడమే.

 

అక్షయ్ కుమార్ సినిమా అనగానే సెకండ్ హీరోయిన్ పాత్ర అయినా కూడా పూజ హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతూ ఉండగా త్వరలోనే పూజ అక్షయ్ కుమార్ తో సెట్ లో కలిసి నటించబోతోంది. ఇప్పటికే టాలీవుడ్ లో అగ్రహీరోయిన్ గా వెలుగొందుతున్న పూజా హెగ్డే బాలీవుడ్ లో కూడా తన జెండా పాతేస్తదేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: