తెలుగు సినీ చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఎస్.ఎస్.రాజమౌళి ది. లెజెండరీ డైరెక్టర్ తన సినిమా పనుల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఏవైనా పెద్ద సినిమాలు విడుదల కాగానే వాటిని చూసి అవి ఎలా ఉన్నాయి అని తన అభిప్రాయాన్ని తరచుగా సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఉంటారు. అయితే మహేష్ బాబు మరియు అల్లు అర్జున్ నటించిన రెండు సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్న సంగతి తెలిసిందే.

 

కానీ రాజమౌళి మాత్రం సంక్రాంతికి విడుదలైన రెండు చిత్రాల గురించి ఏమీ మాట్లాడలేదు. అసలు ఆయన చిత్రం చూశాడా లేదా అన్న విషయం కూడా తెలియదు. కొద్ది రోజుల ముందు మత్తువదలరా ప్రీమియర్ షో చూసి చిత్రాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరిన రాజమౌళి తరువాత ట్విట్టర్లో కనపడలేదు. అయితే సంక్రాంతికి కచ్చితంగా రాజమౌళి ట్వీట్ పడుతుందని ఆశించిన వారంతా అతను మౌనంగా ఉండడమే మంచిది అని ఫీల్ అయ్యారు.

 

ఒక సినిమా గురించి ట్వీట్‌ చేసి మరొక దాని గురించి మాట్లాడకపోయినా, లేదా మొహమాటానికి పోయి అందరినీ మచ్చిక చేసుకోవాలని చూసినా కానీ సోషల్‌ మీడియాలో రాజమౌళికి ఇబ్బందే. అందుకేనేమో చిత్రాల గురించి తన స్పందన తెలియజెయ్యనివ్వకుండా ఇంతవరకు దాటవేసాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ పనులతో తీరిక లేకుండా వున్న రాజమౌళి ఇటీవల వేరే వాళ్ల సినిమా వేడుకలకి పిలిచినా కానీ రావడం కుదరదని చెప్పేస్తున్నాడు.

 

అయినా ఆశ్చర్యకరంగా ఎంత బిజీ లో ఉన్న రాజమౌళి ఒక పెద్ద తెలుగు సినిమాని చూసి తన స్పందన చెప్పడం అలవాటు. ఒక టైంలో దీనిని ప్రోటోకాల్ గా తీసుకున్న రాజమౌళి మధ్య సినిమాలకు సరిగ్గా ఎందుకు స్పందించలేదన్న కారణం ఆయనకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: