ప్రేమ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది.  దాన్ని ఎంతగా ఆస్వాదిస్తే అంత బాగుంటుంది.  అందుకే ప్రేమలో మునిగిపోయిన వ్యక్తులు దాని నుంచి బయటకు రాలేరు.  అలా అందులోనే మునిగిపోయి ఉంటారు.  ఆ తీయదనాన్ని ఆస్వాదిస్తుంటారు.  అందరికంటే తామే గొప్పవ్యక్తులం అని ఫీలవుతుంటారు.  ఫీలయ్యి తీసిన సినిమాలు చాలా కొత్తగా కనిపిస్తుంటాయి.  దానికి ఓ ఉదాహరణ ఏం మాయ చేశావే సినిమా.  ఈ సినిమాలో లవ్ ఫీల్ కొత్తగా ఉంటుంది.  ఆ కొత్తదనాన్ని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు.  
అందుకే ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ సాధించింది.

 అద్భుతమైన సినిమాగా గుర్తింపు పొందింది. ఈ సినిమా తరువాత నాగ చైతన్య మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.   లవర్ బాయ్ గానే పేరు తెచ్చుకున్న ఈ నటుడు ఆ తరువాత అద్భుతమైన చిత్రాలు ఎన్నో చేశారు.  ఇప్పుడు ఈ హీరో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు.  ఇందులో సాయి పల్లవి హీరోయిన్.  ఈ సినిమాలో లవ్ ఫీల్ చాలా కొత్తగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.  


సినిమా చరిత్రలో హాలీవుడ్ సినిమా టైటానిక్ కు ఓ చరిత్ర ఉన్నది.  ఈ సినిమా అప్పట్లో భారీ వసూళ్లు సాధించింది.  అవతార్ సినిమా వచ్చే వరకు ఇదే టాప్ సినిమా.  టైటానిక్ లో లవ్ స్టోరీ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.  చివర్లో తన ప్రేయసిని బ్రతికించుకోవడం కోసం హీరో చనిపోతాడు.  హీరో చనిపోయాక అతని ఫీలింగ్స్ తో ఆమె బ్రతికేస్తుంది.  జీవితాన్ని అలానే గడుపుతుంది. ఈ ఫీల్ అందరిని నచ్చింది.  అందుకే సినిమాకు బ్రహ్మరధం పట్టారు.  


అయితే, ఇదే ఫీల్ ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాలో కూడా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి వచ్చిన ఇద్దరు తమ జీవితంలో ఎదగడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా కలుసుకుంటారు.  అలా కలుసుకున్న ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అవుతారు.  ప్రేమలో పడతారు.  అయితే, హీరో అనుకోకుండా మరణిస్తాడు.  హీరో మరణం తరువాత అతని జ్ఞాపకాలతో హీరోయిన్ బ్రతికేస్తుంది.  ఈ లవ్ స్టోరీలో ప్రతి ఒక్కరి మనసుకు చేరువయ్యేలా ఫీల్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది.  ఈ ఫీల్ వర్కౌట్ అయితే సినిమా ఎక్కడికో వెళ్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: