ఇండస్ట్రీలో హిట్లు కొట్టే వారికే వరుస అవకాశాలు వస్తాయి. అది హీరో అయినా హీరోయిన్ అయినా సరే ప్రేక్షకులు వాళ్లను మెచ్చుతున్నారు అంటే వారి పంట పడినట్టే. ప్రస్తుతం తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ ఎవరంటే టక్కున అందరు చెప్పే పేరు పూజా హెగ్దె. తెలుగులో చేసిన మొదటి రెండు సినిమాలు వర్క్ అవుట్ కాలేదు. అయినా సరే బన్నితో చేసిన డిజే సినిమా అమ్మడికి సూపర్ క్రేజ్ తెచ్చింది. బికిని లుక్స్ తో కనిపించి కుర్రాళ్లను డిస్ట్రబ్ చేసిన పూజా హెగ్దె అక్కడ నుండి వరుస హిట్లు కొడుతూనే ఉంది. 

 

రీసెంట్ గా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న పూజా హెగ్దె ప్రస్తుతం ప్రభాస్ సినిమా చేస్తుంది. మరో పక్క అఖిల్ తో కూడా రొమాన్స్ చేస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్దె ఫైనల్ అయ్యింది. ఇక ఇదిలాఉంటే కింగ్ నాగార్జున కన్ను కూడా పూజా హెగ్దె మీద పడినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ చైతుతో ఒక లైలా కోసం సినిమా చేసిన పూజా హెగ్దె, అఖిల్ తో కూడా జత కడుతుంది. 

 

నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో తెరకెక్కే బంగార్రాజు సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దెని తీసుకోవాలని చూస్తున్నారట. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ తో కెరియర్ సాగిస్తున్న పూజా హెగ్దెకి కింగ్ నాగార్జున సరసన నటించే ఛాన్స్ రావడం కూడా గొప్ప విసయమని చెప్పొచ్చు. మరి పూజా నాగ్ సినిమాకు ఓకే చెబుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఆల్రెడీ చైతూతో చేసిన రకుల్ నాగ్ జత కట్టింది. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరితో నటించడం కొంతమంది హీరోయిన్స్ వల్లే జరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: