టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంట్రటైన్ మెంట్ గా తెరకెక్కిన ‘హ్యాపిడేస్’ మూవీలో హీరోయిన్ గా నటించింది తమన్నా.  మొదటి సినిమా తోనే మంచి ఇంప్రేషన్ కొట్టేసిన ఈ బ్యూటీ తర్వాత స్టార్ హీరోల సరసన నటించడం బాగా కలిసి వచ్చింది.  అయితే ఎంత త్వరగా పేరు తెచ్చుకుందో అంతే నిదానం అయ్యింది.  తెలుగు, తమిళంలోనే కాదు బాలీవుడ్ లో సైతం ఈ మిల్క్ బ్యూటీ నటించింది.  కానీ అక్కడ అదృష్టం కలిసి రాలేదు. దాంతో దక్షిణాది వైపే ఎక్కువ మొగ్గు చూపింది.  ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తో రచ్చ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. 

 

హీరోయిన్ గానే కాకుండా ఐటమ్స సాంగ్స్ లో కూడా ఈ అమ్మడు తనకంటూ క్రేజ్ సంపాదించింది.  ఇటీవల చిరంజీవి సరసన సైరా మూవీలో నటించింది. ప్రస్తుతం తాను నటనకు ప్రాదాన్యత ఉన్న పాత్రలే చేస్తానంటుంది. కెరీర్ మొదట్లో పాత్రల పరిధి, దానికున్న ప్రాధాన్యత గురించి పెద్దగా ఆలోచించించ లేదని చెబుతున్న తమన్నా ఇన్నాళ్లుగా తనకు సినిమాల్లో అవకాశాలు రావడం మాత్రం తానూ సాధించిన గొప్ప లక్ష్యంగా అనుకుంటున్నా అంటుంది.  ఇదే సమయంలో తాను కొన్ని ఛాన్సులు కూడా మిస్ చేసుకున్నా అంటుంది.  ప్రస్తుతం బాలీవుడ్ లో సైతం మంచి ఛాన్సులు వస్తున్నాయని.. తన కెరీర్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అంటుంది.

 

ఇప్పుడు తనకి దర్శకులు బలమైన పాత్రలు రాస్తున్నారని.. ఇప్పుడు స్క్రీన్ నిండుగా నటించడానికి స్కోప్ ఉన్న పాత్రలు దక్కుతున్నాయని చెబుతున్న తమన్నా.. సినిమాల్లో అయినా, ఏ రంగంలో అయినా మనం అనుకున్న మార్పు వెంటనే జరగదని.. దానికి చాలా టైం పడుతుంది అని అంటుంది. మొత్తానికి మిల్కీ బ్యూటీ గ్లామర్ పై కాకుండా నటనపైనే ఎక్కువ శ్రద్ద చూపించడం కూడా మంచిదే అని అంటున్నారు సినీ వర్గాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: