క్రేజీ బ్యూటీ రష్మిక కు ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఎదురీత మొదలైంది. ఇప్పటి వరకు మిడిల్ రేంజ్ హీరోల హీరోయిన్ గా తనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పరుచుకున్న రష్మిక టాప్ యంగ్ హీరోల హీరొయిన్ గా మారిపోదామని ఎన్నో ఆశలు పెట్టుకుని ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటించింది.

వాస్తవానికి ఈ మూవీలోని తన పాత్ర ఏమిటి అన్న వివరణ కూడ అడగకుండా రష్మిక అనీల్ రావిపూడి అడగగానే వెంటనే ఒకే చెప్పేసింది అని టాక్. ముఖ్యంగా ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా మహేష్ ఈ మూవీలో చూపించిన నటనకు అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా వేసిన మాస్ స్టెప్స్ కు విమర్శకుల నుండి సగటు ప్రేక్షకుడి వరకు మహేష్ కు ప్రశంసలు వస్తున్నాయి.

అయితే ఈ మూవీలో ఎప్పుడు లేని విధంగా రష్మిక గ్లామర్ ఎక్స్ పోజ్ చేసినా ముఖ్యంగా ట్రైన్ కామెడీ ఎపిసోడ్ లో రష్మిక చాల ఉత్సాహంగా నటించినా ప్రేక్షకులు ఎవరు ఆమెను పట్టించుకోలేదు. అదే ‘అల వైకుంఠపురములో’ మూవీకి సంబంధించి లేడీ బాస్ గా నటించిన పూజ హెగ్డే నటనకు ఆమె గ్లామర్ ను యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. 

దీనితో సంక్రాంతి రేస్ లో మహేష్ ఫై బన్నీ ఆదిపత్యం ప్రదర్శిస్తే రష్మిక పై పూజ డామినేషన్ స్పష్టంగా కొనసాగింది. ఇలాంటి సమయంలో ఈ సంక్రాంతి రేస్ విజేత బన్నీ అయితే హీరోయిన్స్ విషయంలో పూజ హెగ్డే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా రష్మిక పై జరిగిన ఇన్కంటాక్స్ దాడులు రష్మిక తండ్రి మదన్ కు కర్ణాటక లోని అనేకమంది ప్రముఖ వ్యాపార వేత్తలు రాజకీయ నేతలతో ఉన్న పరిచయాల రీత్యా వారిని కార్నర్ చేస్తూ వారి వ్యవహారాలు తెలుసుకోవడానికి రష్మిక ను ఆమె తండ్రిని చాల లోతుగా విచారిస్తున్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: