అందం అభినయం కలగలిసిన ముద్దుగుమ్మ పూజా హిగ్డే .  ఒక లైలా కోసం సినిమాతో నాగచైతన్య తో జోడి  కట్టి  తెలుగు తెరకు పరిచయమైంది పూజా హెగ్డే. ఇక ఆ తర్వాత వరుస  సినిమా అవకాశాలను అంది పుచ్చుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ... టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ కి ఎంత మంది కొత్త హీరోయిన్లు వస్తున్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది... టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. ఇక తన అందాల ఆరబోతతో కూడా తెలుగు ప్రేక్షకులందరికీ చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం తెలుగులో బిజీ బిజీగా ఉన్న హీరోయిన్ లలో ఒకరిగా ఉంది పూజా హెగ్డే. ఇప్పటికే ఈ అమ్మడు టాప్ హీరోలందరి సరసన మెరిసింది.

 

 

 

 గతంలో అల్లు అర్జున్ తో  డిజె సినిమాలో నటించిన ఈ అమ్మడు తాజాగా అలా వైకుంఠపురములో  సినిమాతో మరోసారి జోడీ కట్టింది. ఇక వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ అమ్మడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు తానెప్పుడూ ముందుంటానని... జీవితంలో సాహసాలు చేయడం చాలా అవసరం అంటూ చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. సాహసోపేతమైన నిర్ణయాలు అందరిలో మనని  ప్రత్యేకంగా నిలబెడతాయి అంటూ చెబుతుంది ఈ అమ్మడు. అందరిలో కంఫర్టబుల్ గా  బతకడంలో ఎంతో ఆనందం ఉంటుంది అని చెబుతోంది. 

 

 

 వందమందిలో  ఒకరులా కాకుండా... 100 మందిలో ప్రత్యేకంగా కనిపించాలంటే... మనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు రావాలంటే మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచించాల్సి ఉంటుంది... కొత్తగా ప్రయత్నించినప్పుడు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి వాటిని తట్టుకుని నిలబడినప్పుడే మనకు సరైన గుర్తింపు వస్తుంది అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. కాగా తాజాగా ఈ అమ్మడు అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురములో  సినిమాలో నటించి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే అరవింద సమేత మహర్షి లాంటి మంచి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు అల వైకుంఠపురములో  సినిమాతో హ్యాట్రిక్ సాధించింది .

మరింత సమాచారం తెలుసుకోండి: