ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా ఛాన్స్ వస్తే చాలు నేనేంటో నిరూపించుకుంటా అనే వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఒక్క సినిమా ఛాన్సు దొరికినా కూడా సక్సెస్ కాకపోతే మరో సినిమా ఉండదు అన్న విషయం సినీ రంగంలోకి దిగినవారికే తెలుస్తుంది. సినీ పరిశ్రమలో అందం, అభినయం మాత్రమే కాదు లక్కు కూడా ఉండాలని అంటారు. ఇలా అదృష్టం కలిసిరాని వారుసులు సైతం కంటికి కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే ముకుంద, ఒక లైలా కోసం మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండు మూవీస్ లో ఎంతో సాంప్రదాయంగా అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపించింది.
బాలీవుడ్ నుంచి వచ్చి ఇంత ట్రెడిషన్ గా ఉండటం ఈ అమ్మడికి అస్సలు కలిసిరాలేదు. దాంతో తెలుగు లో చాలా గ్యాప్ రావడంతో బాలీవుడ్ వెళ్లి హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో సరసన మొహింజుదారో మూవీలో నటించింది. పాపం ఈ మూవీ కూడా భారీ డిజాస్టర్ అయ్యింది. ఇదే సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించి ‘దువ్వాడజగన్నాథం’ మూవీ ఈ అమ్మడి జాతకమే మార్చింది. ఈ మూవీలో బ్లాక్ బికినీసీన్లో రెచ్చిపోయిన నటించింది. ఇంకేముంది దర్శక, నిర్మాతలు ఫిదా.. కుర్రాళ్లైతే అందాలు తనివితీరా ఆస్వాదించారు.
హీరోలు సైతం తమ పక్కన ఈ బ్యూటీ ఉంటే బాగుంటుంది అని సూచించే స్థాయికి వచ్చారంటే అతిశయోక్తి లేదు. అల్లు అర్జున్ సరసన ఇప్పటికీ రెండు సార్లు నటించింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ సరసన నటిస్తుంది. త్వరలో అక్కినేని అఖిల్ తో కూడా ఓ మూవీలో కనిపించబోతుంది. మొత్తానికి తెలుగు హీరోల సరసన వరుసగా హిట్స్ అందుకున్న బ్యూటీ ఈ సంక్రాంతి కానుకగా త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ తో మంచి హిట్ సొంతం చేసుకుంది.