నిన్నటి రోజున వరంగల్ లో జరిగిన ‘సరిలేరు నీకెవ్వరు’ విజయోత్సవ సభలో మహేష్ ఫీలింగ్స్ లో కనిపించిన ఆనందం నిజమేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ‘సరిలేరు’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినా ఆ టాక్ ను పట్టించుకోకుండా తన మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ఈ మూవీ విడుదలైన రెండవరోజు నుండే ప్రచారం మొదలు పెట్టేశాడు మహేష్. 

మూవీ కలక్షన్స్ పై అనేకమందికి సందేహాలు ఉన్నా ఆ విషయాలు పట్టించుకోకుండా తన మూవీ పై నెగిటివ్ ప్రచారం జరుగుతోంది అన్న సంకేతాలు ఇస్తూ నిన్నటిరోజున వరంగల్ లో భారీ విజయోత్సవ సభను మహేష్ సూచనతో నిర్మాత దిల్ రాజ్ ఏర్పాటు చేసాడు అన్నవార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఓవర్సీస్ కింగ్ అన్న ట్యాగ్ ను కలిగి ఉన్న మహేష్ ఇమేజ్ ని ‘సరిలేరు’ అందుకోలేకపోయింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

మూవీ ఈ వారాంతంతో రెండు మిలియన్ డాలర్స్ క్రాస్ చేయడం ఖాయం అయినా ఈ మూవీని మోజుపడి 3.5 మిలియన్ డాలర్లకు కొనుక్కున్న ఈ మూవీ ఓవర్సీస్ బయ్యర్లకు బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడ ‘సరిలేరు’ పరిస్థితి బయటకు చెప్పుకున్నంత సంతృప్తికరంగా లేదని కొన్ని చోట్ల ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు వచ్చినా మరి కొన్ని చోట్ల ఈ మూవీ బయ్యర్లకు నష్టాలు తప్పవు అని అంటున్నారు. 

దీనితో రంగంలోకి దిగిన దిల్ రాజ్ ‘సరిలేరు’ డిస్ట్రిబ్యూటర్లను టచ్ లోకి తీసుకుని ఖంగారు పడవద్దు అని చెప్పడమే కాకుండా త్వరలో సెట్స్ పైకి రాబోతున్న మహేష్ వంశీ పైడిపల్లిల మూవీ రైట్స్ ను కూడ ‘సరిలేరు’ డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తాము అని అంటూ డిస్ట్రిబ్యూటర్లను సముదాయిస్తున్నట్లు గాసిప్పులు వినిపిస్తున్నాయి. దీనితో ‘సరిలేరు’ కు సక్సస్ మేకప్ సార్థవంతంగా జరుగుతోంది అంటూ కొందరి కామెంట్స్..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: