సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చాడు.. కానీ పరువు మాత్రం ఘోరంగా పోగొట్టుకున్నాడు. అసలు వివరాల్లోకి వెళ్తే.. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా దర్బార్  సంక్రాంతి సందర్భంగా విడుదల అయ్యింది. అయినా ఆలా సంక్రాంతికి వచ్చే ముందు.. ముందు వెనుక ఏ సినిమాలు వస్తున్నాయో కాస్త చూసుకోవాలి కదా.. లేకుంటే ఎలా ?               

 

అటు సరిలేరు నీకెవ్వరూ వచ్చింది.. ఇటు అల వైకుంఠపురములో వచ్చింది.. రెండు స్టార్ హీరోల చిత్రాలు. మన రజినికాంత్ సూపర్ స్టార్.. కానీ.. సినిమా అంత అద్భుతం లేకపోయే.. సినిమా అంత ఏదో ఆలా పొడిగించేశారు. అందుకే ప్రేక్షకులను అంత ఆకట్టుకోలేక పోయే.. మొదట సంక్రాంతి చిత్రం ఇదే అని అనుకున్న.. తర్వాత తెల్సింది సంక్రాంతి చిత్రం అంటే దర్బార్ కాదు.. సరిలేరు నీకెవ్వరూ.. అల వైకుంఠపురములో అని.                 

 

సినిమా ఎలా ఉందొ కలెక్షన్లు కూడా అలాగే ఉన్నాయి.. దింతో సినిమా కలెక్షన్లు అంత సాదించలేకపోయే.. దీంతో తెలుగు రైట్స్‌ దక్కించుకున్న నిర్మాతకు రక్త కన్నీరు మిగిలింది. ఏకంగా 10 కోట్ల వరకు నష్టం తప్పదంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అత్యంత దారుణమైన కలెక్షన్స్‌ నమోదు అవ్వడంతో నిర్మాతలు లబో దిబో మంటున్నారు. 

 

బయ్యర్లు కూడా తీవ్ర నష్టాలతో సినిమాను నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 90 శాతం థియేటర్లను తొలగించారు. త‌మిళ్‌లో ఈ సినిమా ఓ మోస్త‌రుగా వ‌ర్క‌వుట్ అయినా తెలుగులో మాత్రం అట్ట‌ర్ ప్లాప్ అయిన‌ట్టే... సంక్రాంతికి వచ్చిన ఈ స్టార్ హీరో పరువు ఇలా పోయింది.. ఏది ఏమైనా స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా వారంలోనే ఇంత నష్టం అంటే.. పరువు పోయినట్టే కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: