టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో మెగాస్టార్ తర్వాత మాస్ ఇమేజ్ తో దూసుకు వెళ్లిన హీరో పవన్ కళ్యాన్ ఒక్కరే అని చెప్పొచ్చు.  అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి మూవీతో తన ప్రస్థానం మొదలు పెట్టి త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి మూవీ వరకు తన సీనీ ప్రస్థానాన్ని కొనసాగించారు.  గబ్బర్ సింగ్ మూవీ తర్వాత ‘జనసేన’ పార్టీ స్థాపించిన ఆయన అప్పటి రాజకీయాలపై పోరాటం చేశారు.  ఇటీవల ఏపిలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపు నుంచి ఒకే ఒక్కరు ఎన్నిక అయ్యారు. ట్విస్ట్ ఏంటంటే రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కళ్యాన్ పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తు తో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

 

ఇవన్నీ పక్కన బెడితే పవన్ కళ్యాన్ ఇప్పుడు వెండి తెరపై కనిపించేందుక సన్నద్దమవుతున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘పింక్’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌తో కలిసి దిల్ రాజు ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ మూవీ తమిళ్ లో స్టార్ హీరో అజిత్ నటించి సూపర్ హిట్ అందుకున్నారు.  ఇక ఈ సినిమాతో పవన్‌కల్యాణ్ తిరిగి సినిమాల్లోకి వస్తుండడంతో అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ నెల 20 నుండి ఈ స్టార్ హీరో షూటింగ్‌లో పాల్గొననున్నారట.

 

పవన్‌పై ఓ పవర్‌ఫుల్ యాక్షన్ సీన్‌ని షూట్ చేయనున్నారని తెలిసింది. అందుకోసం చిత్ర యూనిట్ భారీ సన్నాహాలు చేస్తోంది.  తమపై జరిగిన అరాచకాన్ని ఎదిరించి పోరాడుతున్న ముగ్గురు అమ్మాయిలకు అండగా నిలబడే ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో పవన్ కళ్యాన్ నటించబోతున్నారు. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్ర ఇది. అంజలి, నివేదా థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం కాస్త సస్పెన్స్ కొనసాగుతుంది. యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: