మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేకత ఉంటుంది. డైలాగ్స్, కామెడీ, ఫైట్స్, డ్యాన్స..పాటలు ఒక సినిమాకు కావల్సిన ఎలిమెంట్స్ అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటా సినిమా విజయం కోసం అహర్నిశలూ పాటుపడే దర్శకుడిగా మంచి పేరు ఉంది. త్రివిక్రమ్ కథలు సిద్ధం చేసుకునే విధానమే కొత్తగా ఉంటుంది. ముందుగా ఒక లైన్ అనుకుని .. అన్ని తరగతుల ప్రేక్షకులను అలరించే అంశాలను మేళవిస్తూ వెళతాడు. తన సినిమాలో చాలా నేచురల్ గా ఉంటే కామెడీని చూపిస్తుంటారు. ఇక త్రివిక్రమ్ అంటే హీరోయిజం ఓ లెవెల్ లో ఉంటుందన్న విషయం తెలిసిందే. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి హాస్యం అందిస్తూనే.. ఏ అవకాశాన్ని వదులుకోకుండా కథను పరుగులు తీయించి, చివరికి ఎమోషన్ కి కనెక్ట్ చేస్తాడు.
ఈ లాజిక్ తోనే మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకొని సినిమాలు విజయవంతం చేసుకుంటున్నారని ఫిలిమ్ వర్గాల్లో టాక్. ఇటీవల థియేటర్లకు వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా కూడా అదే విషయాన్ని నిరూపించింది. గతంలో అల్లు అర్జున్ తో జులాయి సినిమాతో ఓ యువకుడు పట్టుదలతో ఓ పని అనుకుంటే ఎలా సాధించాడు అన్న కోణంలో చూపించారు. ఇక సన్నాఫ్ సత్యమూర్తి లో తండ్రి కొడుకుల అనుబంధం గురించి ప్రస్తావించారు. ఈ రెండు సినిమాలు అల్లు అర్జున్ వి కావడం విశేషం. తాజాగా అల వైకుంఠపురములో మూవీతో మరో విజయం అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను త్రివిక్రమ్ సినిమాలకి మంచి క్రేజ్ వుంది. ఆయన సినిమాలకి అక్కడ మంచి మార్కెట్ వుంది.
'అల వైకుంఠపురములో' సినిమా అక్కడ 2 మిలియన్ మార్క్ వసూళ్లను దాటేసింది. ఇటీవల కాలంలో ఈ మార్క్ చాలా తగ్గిందని బాధపడుతున్న సమయంలో అల వైకుంఠపురములో చేసిన సందడి అతా ఇంతా కాదు. గతంలో 'అజ్ఞాతవాసి' .. 'అ ఆ'.. 'అరవింద సమేత' సినిమాలు కూడా ఓవర్సీస్ లో 2 మిలియన్ క్లబ్ లో చేరిపోయాయి. వరుసగా నాలుగు సినిమాలతో 2 మిలియన్ మార్క్ ను సాధించిన అరుదైన రికార్డు త్రివిక్రమ్ ఖాతాలోకి చేరిపోవడం విశేషం.