సినిమాల్లో జరిగే సిత్రాలు అప్పుడప్పుడు బహు చిత్రంగా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఉన్న సెంటిమెంటును చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఇప్పుడు ఓ దర్శకుడు కూడా ఇలాంటి ఓ సెంటిమెంటును ఫాలో అవుతున్నాడట. అదేమంటే హాట్ హాట్ యాంకర్‌గా పేరుతెచ్చుకున్న అనసూయకు రంగస్దలం సినిమాలో అవకాశం ఇచ్చి ఆమె రేంజ్‌ను హైప్ చేశాడు దర్శకుడు సుకుమార్.

 

 

ఇకపోతే ‘రంగస్థలం’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమాలో చరణ్ యాక్టింగ్‌కు ఫిదా కాని అభిమాని లేరు. ఇదేగాక ‘రంగస్థలం’ చిత్రంతో చరణ్ టాలీవుడ్ రికార్డులను తిరగరాశారు. చరణ్‌తో పాటుగా ఈ సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించిన హాట్ యాంకర్ అనసూయ పర్ఫార్మెన్స్‌కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడమే కాకుండా, రంగమ్మత్త పాత్రకు మంచి గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే.

 

 

అయితే ఈ సినిమాలో అనసూయ చేసిన నటనకు సుకుమార్ చాలా ఇంప్రెస్ అయ్యారు... దాంతో తాను తీసే ప్రతి సినిమాలో అనసూయకు తప్పకుండా ఓ పాత్ర ఉండేలా చూస్తాననే మాట ఇచ్చినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. ఇక అనుకున్నట్లుగానే సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో అనసూయ కోసం ఓ ప్రత్యేక పాత్రను క్రియేట్ చేశారట. అంతే కాకుండా ఈ పాత్ర ఆమెకు మరింత పేరు తీసుకొస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారట..  

 

 

ఇదిలా ఉండగా తాజాగా బన్నీ నటించిన  ‘అల వైకుంఠపురములో’  చిత్రంలో  పూజా హెగ్డే హీరోయిన్‌గా, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమా ఇప్పటికి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కాగా  అనసూయ రంగస్థలం తెచ్చిపెట్టిన పేరును, సుకుమార్-బన్నీ సినిమాలో ఎలాంటి పాత్రతో మెప్పిస్తుందో చూడాలి అని అనుకుంటున్నారట ప్రేక్షకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: