ముంబై బ్యూటీ పూజా హెగ్డే సుడి మాములుగా లేదు. వరుసగా బిగ్ ఛాన్స్ లు పట్టేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ ఎంపరర్ తో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. పూజా హెగ్డే తర్వాత పవర్  స్టార్ తో జోడి కట్టబోతున్నట్టు టాలీవుడ్ లో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

 

ప్రస్తతం టాలీవుడ్ లో పూజా హెగ్డే టైం నడుస్తోంది. రెండు సంవత్సరాల ముందు వరకు రకుల్ ప్రీత్ సింగ్ ఎంత జోరు కొనసాగించిందో ఇపుడు అదే జోరును పూజా హెగ్డే కొనసాగిస్తోంది. ఈ అమ్మడు ప్రసుత్తం టాలీవుడ్ స్టార్ హీరోలందరికి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. రీసెంట్ గా అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ తో సెకండ్ టైమ్ జోడీ కట్టిన పూజా మరోవైపు ప్రభాస్ కు జోడీగా జాన్ చిత్రంలో నటిస్తోంది. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ తో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు వినిపిస్తోంది. 

 

ఇంతకుముందు ఎన్టీఆర్ తో అరవింద సమేత, మహేశ్ బాబుతో మహర్షిలో జోడి కట్టిన పూజా హెగ్డే ఇప్పుడు పవన్ తో కూడా నటించబోతుందట. పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో.. రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో రూపొందబోతున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ అయితే బాగుంటుందని యూనిట్ నిర్ణయించుకుందట. 


పింక్ రీమేక్ కోసం పవన్ కళ్యాణ్ 40రోజులు డేట్ లు కేటాయించినట్టు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం పవన్ రాజకీయంగా చాలా బిజీగా ఉన్నాడు. దీంతో పింక్ రీమేక్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యేలోగా పవన్ షూటింగ్ కు వస్తాడని సమాచారం. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్, పూజా హెగ్డే కాంబినేషన్ కొత్తగా ఫ్రెష్ గా ఉంటుందని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: