సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక మందన్నా ఇంట్లో జరిగిన ఐటీ సోదాలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారిలో రష్మిక మందన్నా కూడా ఒకరు. దాదాపు కోటి రూపాయలకు పైగా రష్మిక మందన్నా పారితోషికం రూపంలో తీసుకుంటోందని తెలుస్తోంది.               
 
ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో రష్మిక మందన్నా పారితోషికం గురించి చర్చలు జరుగుతున్న సమయంలోనే ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఏపీ, తెలంగాణకు చెందిన కొందరు అధికారులు కర్ణాటక రాష్ట్రంలోని కొడగు ప్రాంతంలోని రష్మిక మందన్నా ఇంట్లో సోదాలు జరిపారు. తెలుగు రాష్ట్రాలతో రష్మిక మందన్నా ఆర్థిక వ్యవహారాలు సంబంధం ఉన్నవి కావడంతో ఇక్కడి అధికారులు అక్కడికి వెళ్లి సోదాలు జరిపినట్టు తెలుస్తోంది. 
 
రష్మిక ఇంట్లో ఐటీ అధికారులు ఏం స్వాధీనం చేసుకున్నారు అనే ప్రశ్నకు మాత్రం ఐటీ అధికారులకు ఈ సోదాల్లో కీలక పత్రాలు లభ్యం అయినట్టు తెలుస్తోంది. 25 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారని వార్తలు వస్తున్నప్పటికీ ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఐటీ అధికారులు రష్మిక మందన్నాపై ఏవైనా కేసులు నమోదు చేస్తారా..? అనే అంశం గురించి స్పష్టత రావాల్సి ఉంది. 
 
అధికారులు రష్మిక మందన్నాను విచారణకు పిలుస్తారా..? అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో రష్మిక ఇంటిపై దాడులు జరగటం కలకలం సృష్టిస్తున్నాయి. అతి త్వరలో టాలీవుడ్ కు చెందిన కొంతమంది హీరోయిన్లపై కూడా ఐటీ శాఖ దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: