ఈ మద్య ఎక్కువగా అన్ని సినీ పరిశ్రమలు రిమేక్ లపై ఆధారపడుతున్నాయి. మంచి హిట్ మూవీ ఇతర భాషల్లో రిమేక్ చేయడం సర్వ సాధారణం అయ్యింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో అమితాబచ్చన్ నటించిన పింక్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీని తమిళంలో స్టార్ హీరో అజిత్ నటించారు. ఈ మూవీ తమిళనాట మంచి విజయం అందుకుంది. తాజాగా తెలుగు లో ఈ మూవీ రిమేక్ చేస్తున్నారు. ఈ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పింక్ రీమేక్తో పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అజ్ఞాతవాసి సినిమాతో డిజాస్టర్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరువాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. రాజకీయాల్లో బిజీ కావటంతో గతంలో అంగీకరించిన సినిమాలను కూడా పక్కన పెట్టేశాడు పవన్.
అప్పట్లో సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెబుతున్నారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇటీవల ఇటీవల తమన్ తన ట్వీట్తో పవన్ రీ ఎంట్రీ సినిమా మీద క్లారిటీ ఇచ్చేశాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పింక్ రీమేక్కు తమన్ సంగీతమందిస్తున్నట్టుగా దిల్ రాజు గతంలో క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ మూవీ పూర్తయిన తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా చేసే ఛాన్స్ ఉందనే వార్త ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. నిర్మాత ఎ.ఎమ్.రత్నం బ్యానర్లో పవన్ ఒక సినిమా చేయవలసి వుంది.
పవన్ రాజకీయాల్లోకి రావడం వలన ఆ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. ప్పుడు ఎ.ఎమ్.రత్నం ఈ ప్రాజెక్టును క్రిష్ కి అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ మూవీ బుర్రా సాయిమాధవ్ తో కలిసి స్క్రిప్ట్ పై తెగ కష్టపడుతున్నట్లు సమాచారం. సినిమాలో రాజకీయాల ప్రస్తావన కూడా ఉంటున్నట్లు సమాచారం. అయితే విలన్ గా బాలీవుడ్ నటుడిని తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం.