బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ .. 'సాహో' తో పెద్ద సాహసమే చేశారు. అయితే ఆ సినిమా ప్రభాస్ కి గట్టి షాకిచ్చింది. అయితే ఆ షాక్ నుండి త్వరగానే కోలుకొని మళ్ళీ తన కొత్త సినిమాకోసం రెడీ అయ్యారు. ఆ సినిమా కోసం ముందు అనుకున్న బడ్జెట్ కంటే తక్కువ బడ్జెట్ తోనే నిర్మించాలని కూడా ప్రభాస్ డిసైడయ్యారు. ఇక 'సాహో' షూటింగ్ పూర్తి కాకముందే ప్రభాస్ ' జాన్ ' షూటింగ్ మొదలు పెట్టారు. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే ని హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఇక ఈ సినిమాలో ఎక్కువభాగం కథ ఐరోపా నేపథ్యంలో సాగుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేశారు చిత్ర బృందం. ఇక కొన్ని నెలల గ్యాప్ తర్వాత ప్రభాస్సినిమా షూటింగ్ లో మళ్లీ పాల్గొంటున్నారని తాజా సమాచారం అందుతోంది.  

 

గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఆస్ట్రియా షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని తిరిగివచ్చారు యూనిట్. అలా ఎందుకు తిరిగి వచ్చారన్నదానికి సరైన కారణం అయితే తెలియదు గాని హీరోయిన్ వల్లే అలా వెళ్ళిన చిత్ర యూనిట్ షూటింగ్ చేయకుండా వచ్చారని మాత్రం అన్నారు. అయితే ఆ సమయంలో పూజా హెగ్డే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో షూటింగ్ జరపడం కుదరలేదట. ఆస్ట్రియా షెడ్యూల్ లో ఎక్కువ భాగం సన్నివేశాలు ప్రభాస్ - పూజ పైన చిత్రీకరించాల్సి ఉందట. అయితే హై ఫీవర్ తో పూజ బాధ పడుతూ ఉండడంతో షూటింగ్ రద్దు చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చారట చిత్ర యూనిట్. ఇక ఈ షెడ్యూల్ రద్దు చేయడంతో నిర్మాతలకు భారీగా నష్టం జరిగిందని సమాచారం. అయితే జెన్యూన్ రీజన్ కాబట్టే అటు ప్రభాస్ గాని ..ఇటు యూవీ క్రియేషన్స్ వారు గాని పూజను ఏమీ అనలేదని చెప్పుకున్నారు.

 

ఇక ఈ శుక్రవారం నుంచి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారభమైంది. ఈ షెడ్యూల్ తర్వాత మరోసారి ప్రభాస్ టీమ్ ఆస్ట్రియాకు బయలుదేరడానికి రెడీ అవుతున్నారట. 'అల వైకుంఠపురములో' సక్సస్ తో పూజ హెగ్డే ఫుల్ జోష్ లో ఉంది. వరుసగా సక్సస్ లు వస్తుండటంతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గాను బిజీగా ఉంది. ఇక ప్రభాస్ సినిమా కూడా తన కెరీర్లో మరో బెస్ట్ మూవీ అవుతుందని పూజా ధీమాగా ఉందట. ఇక ఈ సినిమాను కూడా జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్.    

మరింత సమాచారం తెలుసుకోండి: