ప్రస్తుతం 2020 సంక్రాంతికి సినిమాల సందడి మామూలుగా లేదన్న విషయం తెలిసిందే.. ఈ సంక్రాంతికి సినిమాల విందు ఫుల్ గా ఉంది.. అందుకే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సినిమాలు ఎక్కువగా ఉన్నాయి.. ఈసారి ఏకంగా నాలు సినిమాలు బరిలో దిగుతున్నాయి.. మహేష్ బాబు , రష్మీక మందన్న హీరో హీరోయిన్లు గా కలిసి నటిస్తున్న చిత్రం 'సరిలేరూ నీకెవ్వరూ'.. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు..
ఇకపోతే అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురం లో సినిమా కూడా సంక్రాంతికి విడుదల కాబోతుంది.. త్రివిక్రం శ్రీనివాస్ దర్శత్వంలో వచ్చిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ కాగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు..ఈ సినిమా కూడా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జనవరి 12 విడుదల కు సిద్దంగా ఉంది..రెండు సినిమాలు ఈ మాత్రం ఒకదానికొకటి గట్టి పోటీ నిస్తున్నారు.. రెండు సినిమాలు యు /ఏ సర్టిఫికెట్ ను అందుకున్నాయి.
సరిలేరు, అల సినిమాలకు తప్పుడు కలెక్షన్ ఫిగర్లను ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. సినిమాలు విడుదలై వారం కూడా కాలేదు అప్పుడే నాన్- బాహుబలి రికార్డులు బద్దలు కొట్టామని.. బ్రేక్ ఈవెన్ అయిందని ప్రచారాలు మొదలు పెట్టారు. అసలు ఈ రెండు సినిమాలు ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. నాన్ బాహుబలి రికార్డులు బ్రేక్ చెయ్యలేదు. మరో రెండు రోజుల్లో చాలా ఏరియాలకు బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ అవుతుందని అంటున్నారు.
సరిలేరు నీకెవ్వరు కంటే అల వైకుంఠపురములో ముందుగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల వారి సమాచారం. సరిలేరు ఎక్కువ రేట్లకు అమ్మారు. ఇక నాన్ బాహుబలి రికార్డులను ఈ రెండు సినిమాలు బ్రేక్ చెయ్యలేదు.. అందుబాటులో ఉన్న థియేటర్లను రెండు సినిమాలు పంచుకోవాల్సి రావడమే అందుకు ముఖ్య కారణం. దీనిని బట్టి ఇవి ఎంత ఫేక్ ప్రచారం చేస్తున్నాయో చూడండి..